బంగారం కొనాలంటే ఇప్పుడే కొనేయండి ..!
ప్రస్తుతం దేశంలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తులం బంగారం ధర లక్ష పది వేలకు పైగా ఉండటం సామాన్యులకు షాక్ ఇస్తోంది. సెప్టెంబర్ 16న స్వల్పంగా తగ్గినప్పటికీ, ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,11,200గా నమోదైంది. హైదరాబాద్, ముంబైలలో దీని ధర రూ.1,11,050 ఉండగా, చెన్నైలో రూ.1,11,370కి చేరింది.
ధరల పెరుగుదలకు కారణాలు ఏంటి?
బులియన్ మార్కెట్ నిపుణుల ప్రకారం, ఈ ధరల పెరుగుదలకు అనేక అంతర్జాతీయ, దేశీయ కారణాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్ళేలా చేస్తున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ విలువలో వచ్చే హెచ్చుతగ్గులు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. డాలర్ బలహీనపడినప్పుడు, బంగారం ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, కరెన్సీ విలువ తగ్గుతుంది. దీంతో చాలామంది తమ సంపదను కాపాడుకోవడానికి బంగారంలో పెట్టుబడి పెడతారు, ఫలితంగా డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి.

పండుగ సీజన్ సమీపిస్తుండటంతో భారతదేశంలో బంగారం డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు కూడా బంగారం అవసరం పెరుగుతుంది.బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. కిలో వెండి ధర రూ.1,32,900కి చేరింది. హైదరాబాద్, చెన్నై, కేరళలో ఇది రూ.1,42,900గా ఉంది. ఈ పరిస్థితులు చూస్తుంటే, సమీప భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications