Student: మామతో పాటు అతని 10 మంది ఫ్రెండ్స్ కలిసి ?, 10వ తరగతి అమ్మాయి మీద ? అత్త సైలెంట్!
చెన్నై/విల్లుపురం: 10వ తరగతి చదువుతున్న అమ్మాయి ప్రతిరోజు స్కూల్ కు వెళ్లి వస్తోంది. తల్లిదండ్రులు వాళ్ల కూతురిని కష్టపడి చదివిస్తున్నారు. మా కూతురు మంచి ఉద్యోగం చేస్తుంటే చూడాలని ఉందని ఆమె తల్లిదండ్రులు వారి బంధువులు, స్నేహితులకు చెబుతున్నారు. ఎప్పటిలాగే ఆ అమ్మాయి స్కూల్ కు వెళ్లింది. స్కూల్ లో క్లాసు జరుగుతున్న సమయంలో ఆ అమ్మాయి కుప్పకూలిపోయింది. విషయం తెలుసుకున్న హెడ్ మాస్టర్ ఆ అమ్మాయి పిలిపింపించారు. తనకు నీరసంగా ఉందని ఆ అమ్మాయి హెడ్ మాస్టర్ కు చెప్పింది.
హెడ్ మాస్టర్ కు అనుమానం వచ్చి అమ్మాయిని దగ్గర కుర్చోబెట్టుకుని వివరాలు సేకరించింది. ఆ సమయంలో తన అత్త భర్తతో సహ 10 మంది తన మీద పదేపదే లైంగిక దాడి చేస్తున్నారని, తన శరీరంలో ఎప్పుడంటే అప్పుడు మార్పులు వస్తున్నాయని, తనకు చాలా నీరసంగా ఉంటోందని ఆ అమ్మాయి చెప్పడంతో హెడ్ మాస్టర్ షాక్ అయ్యింది. వెంటనే విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అమ్మాయి కుటుంబ సభ్యులు యువతి అత్తతో పాటు మామ, అతని స్నేహితుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అమ్మాయి మీద గత కొంతకాలంగా సామూహిక లైంగిక దాడి చేస్తున్న 10 మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో అత్తా,మామతో పాటు ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. 10వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల అమ్మాయి మీద 10 మంది సామూహిక అత్యాచారం చెయ్యడం కలకలం రేపింది.
10వ తరగతి చదువుతున్న అమ్మాయి
తమిళనాడులోని విల్లుపురం సమీపంలోని విక్రవాండి సమీపంలోని గ్రామంలో 15 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. విక్రవాండిలోని ప్రభుత్వ స్కూల్ లో ఆ అమ్మాయి 10వ తరగతి చదువుతోంది. 10వ తరగతి చదువుతున్న అమ్మాయి ప్రతిరోజు స్కూల్ కు వెళ్లి వస్తోంది. తల్లిదండ్రులు వాళ్ల కూతురిని కష్టపడి చదివిస్తున్నారు.
స్కూల్ లో కుప్పకూలిపోయిన అమ్మాయి
మా కూతురు మంచి ఉద్యోగం చేస్తుంటే చూడాలని ఉందని ఆమె తల్లిదండ్రులు వారి బంధువులు, స్నేహితులకు చెబుతున్నారు. ఎప్పటిలాగే ఆ అమ్మాయి స్కూల్ కు వెళ్లింది. స్కూల్ లో క్లాసు జరుగుతున్న సమయంలో ఆ అమ్మాయి కుప్పకూలిపోయింది. విషయం తెలుసుకున్న హెడ్ మాస్టర్ హేమలత ఆ అమ్మాయిని ఆమె రూమ్ లోకి పిలిపింపించించారు.
మా మామ, అతని ఫ్రెండ్స్ కలిసి?
తనకు నీరసంగా ఉందని ఆ అమ్మాయి హెడ్ మాస్టర్ హేమలతాకు చెప్పింది. హెడ్ మాస్టర్ హేమలతాకు అనుమానం వచ్చి అమ్మాయిని దగ్గర కుర్చోబెట్టుకుని వివరాలు సేకరించింది. ఆ సమయంలో తన అత్త భర్తతో సహ 10 మంది తన మీద పదేపదే లైంగిక దాడి చేస్తున్నారని, తన శరీరంలో ఎప్పుడంటే అప్పుడు మార్పులు వస్తున్నాయని, తనకు చాలా నీరసంగా ఉంటోందని ఆ అమ్మాయి చెప్పడంతో హెడ్ మాస్టర్ హేమలతా షాక్ అయ్యింది.
హడలిపోయిన విద్యాశాఖ అధికారులు, కుటుంబ సభ్యులు
వెంటనే హెడ్ మాస్టర్ హేమలతా విద్యాశాఖ అధికారి విష్ణుప్రియాకు సమాచారం ఇచ్చారు. అమ్మాయి కుటుంబ సభ్యులు యువతి అత్త శశితో పాటు మామ మణికందన్, అతని 9 మంది స్నేహితుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న విల్లుపురం మహిళా పోలీసులు రంగంలోకి దిగారు.
అత్తకు మ్యాటర్ తెలిసినా సైలెంట్..... కామాంధులు అరెస్టు
అమ్మాయి మీద గత కొంతకాలంగా సామూహిక లైంగిక దాడి చేస్తున్న 10 మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో అత్తా శశి,మామ మణికందన్, వినాయకమూర్తి అనే ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. 10వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల అమ్మాయి మీద 10 మంది సామూహిక అత్యాచారం చెయ్యడం తమిళనాడులో కలకలం రేపింది. అమ్మాయి మీద లైంగిక దాడి చేసిన మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.