బత్తిని సోదరుల చేప మందు ప్రసాదానికి తేదీ ఖరారు
హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం వ్యాధిగ్రస్తుల కోసం ఈ నెల 8,9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్టు బత్తిని సోదరులు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బత్తిని సోదరులు మాట్లాడారు.
బత్తిని సోదరులైన హరినాధ్గౌడ్, సంతోష్గౌడ్, శివానందగౌడ్, గౌరీశంకర్గౌడ్లు మాట్లాడుతూ ప్రజారోగ్యమే ధ్యేయంగా నాలుగు తరాలుగా చేప ప్రసాద వితరణ జరుపుతూ వస్తున్నామన్నారు. 1845 నుంచి 170 సంవత్సరాలుగా తమ వంశీయులు ప్రసాదం పంపిణీ చేస్తున్నారని తెలిపారు.

జూన్ 8వ తేదీ ఉదయం 8:30 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 8.30 గంటల వరకు ఈ పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పొందలేనివారు మూడు రోజుల పాటు దూద్బౌలిలోని తమ నివాసంలో తీసుకోవచ్చన్నారు. ప్రసాదం తీసుకోవడానికి 3 గంటల ముందు, తీసుకున్న గంట పాటు ఆహారం తీసుకోకూడదన్నారు.
వరుసగా నాలుగేండ్లపాటు చేప ప్రసాదం తీసుకుంటే ఉబ్బసం వ్యాధి తగ్గుముఖం పడుతుందన్నారు. ప్రసాదాన్ని సేవించిన వారు 45 రోజుల పాటు పథ్యం పాటించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, కేటీ రామారావు అన్ని విధాలుగా సహకరిస్తున్నారంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications