ఎట్ హోం: సీఎం కేసీఆర్ గైర్హాజరు, మంత్రులు కూడా.. సీఎస్ ఒక్కరే హాజరు
జెండా పండుగ వైభవంగా జరిగింది. గోల్కొండ కోట మీద జాతీయ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. తర్వాత ప్రసంగించారు. తమ ప్రభుత్వం చేసిన, చేస్తోన్న అంశాలను ప్రస్తావించారు. అంతకుముందు ప్రగతి భవన్లో జాతీయ జెండాను కేసీఆర్ ఎగరవేశారు. సాయంత్రం గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఎట్ హోం నిర్వహించారు. దానికి మాత్రం కేసీఆర్ హాజరుకాలేదు.
ఇండిపెండెన్స్ డే సందర్భంగా రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్ హోమ్ నిర్వహించారు. కార్యక్రమానికి రావాల్సిన సీఎం కేసీఆర్ చివరి నిమిషంలో హాజరుకాలేదు. ఎట్ హోమ్ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. వాస్తవానికి సీఎం కేసీఆర్ వస్తున్నారని రాజ్ భవన్ వర్గాలకు సీఎంవో నుంచి సమాచారం అందింది. లాస్ట్ మినిట్ ఏం జరిగిందో తెలియరాలేదు.

ఎట్ హోం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరం కాగా, సీఎస్ సోమేశ్ కుమార్, మరికొందరు ఉన్నతాధికారులు మాత్రమే ప్రభుత్వం తరఫున ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రులు, ఇతర టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా కనిపించలేదు. గవర్నర్ తమిళి సైతో కేసీఆర్ మధ్య పొసగడం లేదు. కోల్డ్ వార్ జరుగుతుంది.
అయినప్పటికీ బహిరంగ వేదికలపై ఆడపా దడపా కలుస్తున్నారు. కానీ ఇవాళ మరోసారి హాజరుకాలేదు. దీంతో ఏం జరుగుతుందనే చర్చ జరుగుతుంది. పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ విషయం గొడవ జరిగిన సంగతి తెలిసిందే.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications