దాడులు జరుగుతున్నాయి.. భద్రత కావాలి.. డీజీపీని కలిసిన కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు సెక్యూరిటీ పెంచాలని కోరుతూ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ పార్టీ నేతలపై జరిగిన దాడుల గురించి ఆయనకు వివరించారు. తనతో పాటు పొన్నం ప్రభాకర్, వంశీచంద్ రెడ్డి, రోహిత్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని తెలిపారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. పోలింగ్ సమయంలో కాంగ్రెస్ లీడర్లపై జరిగిన దాడులకు సంబంధించిన కేసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో డీజీపీ ని అడిగి తెలుసుకున్నారు.

మంగళవారం జరగనున్న కౌంటింగ్ సందర్భంగా కూడా కాంగ్రెస్ నేతలపై దాడులు జరిగే అవకాశముందని అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్లకు భద్రత పెంచాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన డీజీపీ.. భద్రత పెంచే విషయంలో ఆయా జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై దాడులు చేసిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications