హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయరాం హత్య కేసు: మూడ్రోజుల పోలీస్ కస్టడీకి రాకేష్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త జయరాం హత్య కేసులో నిందితులను పోలీసులు మంగళవారం నాడు నాంపల్లి కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. నిందితులను రెండు వారాల పాటు కస్టడీకి అనుమతించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కానీ నిందితులను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

అనంతరం కోర్టు ఆదేశాల మేరకు నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌లను పోలీసులు రేపటి (బుధవారం) నుంచి కస్టడీలోకి తీసుకుంటారు. ఈ కేసుకు సంబంధించి కొందరిని ప్రశ్నించామని అధికారులు చెబుతున్నారు.

Court allows 3 day police custody to Jayarams accused

జయరాం హత్య కేసులో రాకేష్ రెడ్డి, మరో నిందితుడిని కోర్టు తమ కస్టడీకి ఇచ్చిందని ఏసీపీ శ్రీనివాస రావు చెప్పారు. జయరాం, రాకేష్ రెడ్డి నడిపిన ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తామని చెప్పారు. రాకేష్ వెల్లడించే అంశాలను ఆధారంగా కేసును ముందుకు తీసుకు వెళ్తామని చెప్పారు. కొంతమందిని విచారించి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశామన్నారు.

English summary
Court allowed three day police custody to Jayaram's accused Rakesh Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X