కార్తీక పౌర్ణమి శోభ.. ఆలయాల్లో భక్తుల రద్దీ.. దీపారాధనతో ప్రత్యేక పూజలు
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. కోనేరులో పుణ్యస్నానాలు ఆచరిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. అటు వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ వీపరీతంగా ఉంది. పుష్కరిణిలో స్నానం ఆచరించిన అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
భద్రాచలంలో కార్తీక పౌర్ణమి సందడి పెరిగింది. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ సుబ్రమణ్యేశ్వర ఆలయంలో మొక్కులు తీర్చుకుంటున్నారు. అనంతరం రాములోరిని దర్శించుకుంటున్నారు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ సమీపంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. అనంతరం గోదావరిలో కార్తీక దీపాలు వదులుతున్నారు. మొత్తానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలు కొత్త శోభ సంతరించుకున్నాయి. ఆలయాల్లో దీపాలు వెలిగిస్తూ భక్తులు దైవరాధన చేస్తున్నారు.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications