మారిన మెట్రో వేళలు, ఉదయం అరగంట ఆలస్యం, రాత్రి 11 గంటల వరకు, ఎందుకంటే
హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్. మెట్రో రైలు సమయాన్ని పొడిగించినట్టు అధికారులు తెలిపారు. అయితే ఇదివరకు మాదిరిగా ఉదయం 6 గంటల నుంచి కాకుండా 6.30 గంటల నుంచి మెట్రో రైలు నడుస్తాయని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. రాత్రి 11 గంటల వరకు మెట్రో రైల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని వివరించారు.
గమ్యస్థానం నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరి ఆఖరిస్టాప్ వద్ద రాత్రి 11.50 గంటలకు ప్రయాణికులకు దింపుతామని పేర్కొన్నారు. మారిన మెట్రో సమయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు. ఇటీవల ఆర్టీసీ సిటీలో బస్సులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రత్యామ్నాయంగా మెట్రో రైలు ట్రిప్పులను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె తర్వాత నష్టాలను తగ్గించడంపై కార్పొరేషన్ దృష్టిసారించింది. నష్టాలొచ్చే రూట్లలో బస్సులను నడపకపోవడమే మంచిదని అధికారులు సూచించడంతో సీఎం కేసీఆర్ అంగీకరించారు.
దీంతో హైదరాబాద్ నగరంలో వెయ్యి సిటీ బస్సులను రద్దు చేసినట్టు తెలిసింది. శనివారం నుంచి బస్సుల సంఖ్య కూడా తగ్గినట్టు సమాచారం. అయితే ప్రయాణికులకు ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతో మెట్రో రైలు సేవలను మరింత విసృతం చేశారు. ఈ మేరకు మీడియాకు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలియజేశారు.
-
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications