ఖాకీ కర్కశత్వం..? సీపీ పేరు చెప్పినా వినిపించుకోలే.. గాంధీలోకి రానీయకపోవడంతో భార్య మృతి..
కరోనా వైరస్ వల్ల ఆస్పత్రులు చాలడం లేదు. ప్రభుత్వ దవాఖానలు కాదు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా బెడ్స్ ఉండటం లేదు. ఇటీవల ఓ హెడ్ కానిస్టేబుల్ భార్య అనారోగ్య బారినపడింది. రెండు, మూడు ప్రైవేట్ ఆస్పత్రుల తర్వాత చివరికీ గాంధీ దవాఖాన వద్దకొచ్చారు. కానీ అక్కడ డ్యూటీలో సహచర పోలీసులు మాత్రం లోపలికి వెళ్లనీయలేదు. తాను కూడా డిపార్ట్ మెంట్ అని చెప్పినా వినిపించుకోలేదు.
కరోనా నుంచి కోలుకున్న పోలీసులకు కమిషనరేట్ పరిధిలో రాచకొండ సీపీ మహేశ్భగవత్ వెల్కమ్ కార్యక్రమం నిర్వహించారు. తుర్కపల్లిలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న లతీఫ్ తన గోడును వెల్లబోసుకున్నాడు. తన భార్యకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో జూన్ 27న మలక్పేట్లోని యశోద హాస్పిటల్కి తీసుకెళ్లానని వివరించారు. లంగ్స్ ప్రాబ్లమ్తో బాధపడుతున్న ఆమెకు ఐసీయూ ఫెసిలిటీ అవసరమని వైద్యులు తెలిపారు. తమ వద్ద బెడ్స్ లేవని చెప్పి వెనక్కి పంపించేశారు.

అక్కడి నుంచి గ్లోబల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ అక్కడ కూడా సేమ్ సిచుయేషన్... అడ్మిట్ చేసుకోకపోవడంతో అదే అంబులెన్స్లో గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ కూడా చుక్కెదురయ్యింది. తాను హెడ్ కానిస్టేబుల్ అని చెప్పినా తోటి సిబ్బంది పట్టించుకోలేదు. భార్యకు సీరియస్గా ఉందని చెప్పినా బందోబస్తులో ఉన్న పోలీసులు వినిపించుకోలేదు.
డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ వద్దకు సీపీ రెఫరెన్స్ అని చెప్పినా పట్టించుకోలేదని లతీఫ్ వాపోయాడు. గాంధీ ఆస్పత్రిలో వెంటిలేటర్ పెట్టి.. ప్రాణాలు కాపాడాలని వేడుకున్నానని వివరించారు. డీసీపీతో చెప్పించినా వెళ్లనీయలేదు అని.. అర్ధరాత్రి ఒంటి గంటకు అంబులెన్స్ వెనక్కి తిప్పి పంపించారని కన్నీటి పర్యంతమయ్యారు. అలా కిలో మీటర్ వెళ్లేలోపే తన భార్య మృతిచెందిందని ఆవేదన చెందాడు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications