హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివాదంలో ఎమ్మెల్యే 'రాజాసింగ్' పాట.. ''హిందుస్తాన్ జిందాబాద్'' ట్యూన్ మాదంటున్న పాక్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి పాకిస్తాన్ ఆర్మీ.. రాజాసింగ్ ను టార్గెట్ చేసింది. శ్రీరామ నవమి సందర్భంగా ఆయన విడుదల చేసిన "హిందుస్తాన్ జిందాబాద్" పాటపై ఆరోపణలు గుప్పించింది. ఆ సాంగ్ మా నుంచి కాపీ కొట్టారంటూ ట్విట్టర్ వేదికగా మాటల తూటాలు సంధించింది.

Pakistan Army claims BJP MLA Raja Singh copied its song

"పాకిస్తాన్ జిందాబాద్" అనే పాటను ఇటీవల పాకిస్తాన్ డే సందర్భంగా విడుదల చేశారు. తమ దేశానికి చెందిన మీడియా వింగ్ ఆ పాటను రిలీజ్ చేసినట్లు పేర్కొన్నారు పాక్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్. మా సాంగ్ ను రాజాసింగ్ కాపీ కొట్టారని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.

పాకిస్తాన్ మాదంటూ క్లెయిమ్ చేసుకున్న సాంగ్ ఇదే :

ఆదివారం (14.04.2019) నాడు శ్రీరామ నవమి సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్.. హిందుస్తాన్ జిందాబాద్ అనే పాటను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. భారత సైనికులకు ఆ పాటను అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు.

రాజాసింగ్ రిలీజ్ చేసిన పాట ఇదే :

రాజాసింగ్ ఈ పాటను రిలీజ్ చేసిన కొద్ది గంటల్లోనే.. పాక్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మా పాటను కాపీ కొట్టి భారత సైన్యానికి అంకితమిస్తారా అంటూ ప్రశ్నించారు. ఇటీవల ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా.. ఈ సాంగ్ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతోందననే ఉత్కంఠ నెలకొంది.

English summary
The Pakistani Army on Sunday claimed that Telangana BJP MLA Thakur Raja Singh Lodh had copied its song and dedicated it to the Indian armed forces.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X