Congress: హైదరాబాద్లో పోస్టర్ల కలకలం.. కాంగ్రెస్ వ్యతిరేకంగా రాతలు..
హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. సీడబ్ల్యూసీ కరప్ట్ వర్కింగ్ కమిటీ అంటూ హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సభ్యుల ఫొటోలు, వారు చేసిన స్కాముల వివరాలతో పోస్టర్లు గోడలపై పోస్టర్లు అంటించారు. హోర్డింగ్ లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా మొత్తం 24 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఫొటోలు, వారి చేసిన స్కాములంటూ పోస్టర్లపై రాసుకొచ్చారు.
బివేర్ ఆఫ్ స్కామర్స్ (స్కాములు చేసే వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి) అంటూ టాగ్ లైన్ తో పోస్టర్లు ఉన్నాయి. కాగా ఈ రోజు నుంచి సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. హోటల్ తాజ్ కృష్ణలో ఈ సమావేశాలు జరగనున్నాయి. మధ్యాహ్నం టీపీసీసీ విందు అనంతరం సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు సోనియా గాంధీ,రాహుల్ గాంధీ, ప్రియాంక రానున్నారు.

హైదరాబాద్ లో వెలసిన పోస్టర్లపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుందని జీర్ణించుకోలేని వారే ఇలా చేస్తున్నారంటూ విమర్శించారు. ధైర్యంగా ఎదుర్కొలేని వారు రాత్రికిరాత్రే దొంగచాటు పోస్టర్లు వేశారు. వారు పిరికిపందలని అభివర్ణించారు. ఏది ఏమైనా తెలంగాణ కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని వారు చెబుతున్నారు. ఈ పోస్టర్ల వారు కొత్తేమి కాదు.. గతంలో ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించినప్పుడు కూడా ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి.
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోస్టర్లు ఎవరు వేశారనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే సిటీలో ఈ పోస్టర్ల గురించే చర్చ కొనసాగుతోంది. దీనిపై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications