మేడమ్ ఇదీ సరికాదు.. మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి: మంత్రి హరీశ్ రావు
గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ చేసిన కామెంట్ల రచ్చ ఇంకా ముగియలేదు. బీజేపీ- టీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. ఇప్పుడు లైన్లోకి మంత్రి హరీశ్ రావు ఎంట్రీ ఇచ్చారు. అవును.. గవర్నర్ కామెంట్లను ప్రస్తావించారు. వైద్యారోగ్య రంగంపై తమిళి సై చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ఇదీ సరికాదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్యారోగ్య రంగం పరిస్థితి బాగోలేదని గవర్నర్ విమర్శలు చేయగా.. వైద్యుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం సరికాదని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వైద్య వ్యవస్థపై గవర్నర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాని హరీశ్ రావు తెలిపారు. రాష్ట్రంలో వైద్య వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. కానీ వైద్యరంగం పేరు ప్రస్తావించి మరీ.. కామెంట్ చేయడం సరికాదన్నారు. పేదలు మెరుగైన ఆరోగ్యం.. బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పేదల ఆరోగ్యం తమ ప్రయారిటీ అని చెబుతుంది.

గవర్నర్గా మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తమిళిసై సౌందర రాజన్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు కల్పించాలని.. చాలాసార్లు చెప్పానని పేర్కొన్నారు. నిమ్స్ డైరెక్టర్ వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేరారని విమర్శించారు. వర్సిటీల్లో ఖాళీ పోస్టులు, సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలను ప్రస్తావించారు.
గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా హరీశ్ రావు వివరణతో కూడిన కౌంటర్ ఇచ్చారు. వైద్య వ్యవస్థ విషయంగా గవర్నర్ తమిళిసై కామెంట్స్ సరికాదన్నారు. వైద్యుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం బాధాకరమని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో వైద్య, ఆరోగ్య వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న బీబీనగర్ ఎయిమ్స్కు వెళ్లి చూడాలని.. అక్కడ కనీస వసతులు కూడా లేని పరిస్థితిని పరిశీలించాలని గవర్నర్కు మంత్రి హరీశ్ రావు సూచించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications