Viral Flu: రాష్ట్రంలో పెరుగుతున్న వైరల్ ఫ్లూ కేసులు.. ఆస్పత్రులను అలర్ట్ చేసిన ప్రభుత్వం..
తెలంగాణలో దగ్గు, జలుబు, జ్వరంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ కోరంటిలోని ప్రభుత్వ ఫీవర్ ఆసుపత్రిలో ఇన్ఫ్లుఎంజా వంటి లక్షణాలతో సహా వైరల్ ఫ్లూ(Viral Flu) పెరిగిందని, గత వారంలో రోజుకు 600 నుంచి 800 కేసులు నమోదయ్యాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ శంకర్ వెల్లడించారు.గత వారం రోజులుగా ప్రభుత్వ ఫీవర్ ఆస్పత్రిలో రోజుకు 600 నుంచి 800 కేసులు నమోదవుతున్నాయని శంకర్ వివరించారు.
ముక్కు కారటం, తలనొప్పి, శరీర నొప్పులు, పొత్తికడుపు నొప్పి, వాంతులు లక్షణాలతో చాలా మంది ఆస్పత్రికి వస్తున్నారని తెలిపారు. ఈ స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. లేకుంటే ఇది ఒకరి నుంచి మరొకరి వ్యాపిస్తుందని పేర్కొన్నారు. స్వైన్ ఫ్లూ కోసం ఒసెల్టామివిర్ మాత్రలు ఇస్తున్నామని, ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని శంకర్ వివరించారు.

ఇది మెడికల్ షాపులు, ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఇది గాలిలో వ్యాపించే వ్యాధి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. దీనికి సంబంధించి ఐసీఎంఆర్ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిందని గుర్తు చేశారు.
సాధారణంగా వైరల్ జ్వరం ఒక వారంలో తగ్గిపోతుందని. ఇది ఒక వారం కంటే ఎక్కువ ఉంటే, అది వైరల్ జ్వరం కాదని అర్థం చేసుకోవాలన్నారు.

నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉండడంతో స్వైన్ ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. వేసవి కాలం ప్రారంభమైతే వైరస్ తగ్గుతుందన్నారు. వేసవిలో నీటి సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రోఎంటెరిటిస్ కేసులు వస్తాయన్నారు. నీరు, ఆహారం కలుషితం కావడం వల్ల టైఫాయిడ్ వస్తుందన్నారు.
చికెన్ పాక్స్ , డిఫ్తీరియా, మీజిల్స్ కేసులు కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications