Hyderabad: రాయదుర్గంలో దారుణం.. సరోగసీ కోసం వస్తే ప్రాణాలు పోయాయి..!
ఈ మధ్య సంపన్న కుటుంబాలకు చెందిన వారు సరోగసీ విధానం ద్వారా పిల్లలను కంటున్నారు. కొంత మంది పిల్లలు కాకపోవడంతో సరోగసీ విధానానికి వెళ్తున్నారు.
తాజాగా సరోగసీ విధానంలో బిడ్డను కనేందుకు వచ్చిన ఓ మహిళ 9 అంతస్థుల పై నుంచి పడి మృతి చెందింది. ఈ ఘటన హైదరాబాద్ రాయదుర్గంలో జరిగింది.
రాయదుర్గంలోని మై హోమ్ భూజాలో 9వ అంతస్థులోని ప్లాట్ నంబర్ 901లో 55 ఏళ్ల రాజేశ్ బాబు అనే వ్యక్తి భార్య, తల్లితో కలిసి ఉంటున్నాడు. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వారికి పిల్లలు లేకపోవడంతో సరోగసీ విధానంలో పిల్లలను కనాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో ఒడిశాకు చెందిన బ్రోకర్ సందీప్ పరిచయం అయ్యాడు. తమకు సరోగసీ విధానంలో బిడ్డ కనే మహిళ కావాలని రాజేశ్ బాబు సందీప్ కు చెప్పుడు. దీంతో సందీప్ అదే రాష్ట్రానికి చెందిన అశ్వితా సింగ్, ఆమె భర్త సంజయ్ సందీప్ మాట్లాడారు. సరోగసీ విధానంలో బిడ్డను కని ఇస్తే రూ.10 లక్షలు వస్తాయని చెప్పాడు. దీంతో అశ్వితా సింగ్ ఒప్పుకుంది. దీంతో వారి కుటుంబం హైదరాబాద్ వచ్చింది. సరోగసీ సంబంధించి ఒప్పంద పత్రం రాయించుకున్నారు. అశ్వితా సింగ్ రాజేశ్ బాబు ఇంట్లోని ఓ రూమ్ ఉంటుండగా.. భర్త సంజయ్, కుమారుడు సర్వెంట్ క్వార్టర్స్ లో ఉంటున్నారు.

అయితే అశ్విత రూమ్ ఒంటరిగా ఉండడం.. కుమారుడు, భర్తను రాజేశ్ కలవకుండా చేయడం చేశాడు. అలాగే అశ్వితా సింగ్ వేధింపులకు గురి చేసినట్లు తెలిసింది. ఇది భరించలేని ఆమె ఒడిశాకు వెళ్లిపోదామని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో రాజేశ్ బాబు ఆమెను రూమ్ నుంచి బయటకు రాకుండా, ఫోన్ చేయకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అశ్వితా సింగ్ అక్కడి నుంచి తప్పించుకోవాలని చూసింది. కానీ ప్లాట్ కు సెంట్రల్ లాకింగ్ సిస్టం ఉండడంతో ఆమె తప్పించుకోలేకపోయింది.
ఎలాగైనా పారిపోవాలని నిర్ణయించుకున్న ఆమె మంగళవారం తెల్లవారుజామున తన చీరలను ఒకదానికి ఒకటి కట్టి కిందికి వేలాడదీసింది. చీరను పట్టుకుని కిందికి దిగేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పట్టు తప్పి కింది పడి అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం అశ్వతా సింగ్ మృతదేహాన్ని చూసిన సెక్యూరిటీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications