కోటి మంది వలసకూలీలు: కాలినడకన స్వస్థలాలకు చేరిక, పార్లమెంట్లో మంత్రి వీకే సింగ్..
కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ అమలు చేయడంతో.. తొలినాళ్లలో వలసకూలీలు వెతలు అన్నీ ఇన్నీ కావు. పని లేక, వలస వచ్చిన చోట ఉండలేక తమ స్వస్థలాలకు బయల్దేరారు. అలా ఒక్కో కూలీ కథ కన్నీరు తెప్పించింది. అయితే మార్చి నుంచి జూన్ వరకు కోటి మంది వలసకూలీలు తమ స్వస్థలాలకు చేరుకున్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్కు కేంద్ర ఉపరితల రవాణాశాఖ సహాయ మంత్రి వీకే సింగ్ లోక్సభకు రాతపూర్వకంగా తెలియజేశారు.
దేశంలో వివిధ ప్రాంతాల నుంచి కోటి 6 లక్షల మంది వలసకూలీలు కాలి నడకన తమ స్వగ్రామాలకు చేరుకున్నారని వీకే సింగ్ తెలిపారు.. అయితే ఆ సమయంలో 81 వేల 385 ప్రమాదాలు కూడా జరిగాయాని వివరించారు. ప్రమాదాలతో 29 వేల 415 మంది చనిపోయారని పార్లమెంట్కు తెలియజేశారు. అయితే లాక్ డౌన్ సమయంలో రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వలస కూలీలకు సంబంధించి ప్రత్యేక వివరాలతో కూడా సమాచారం తమ వద్ద ఏమీ లేదు అని పేర్కొన్నారు.

వలస కార్మికులకు ఆశ్రయం కల్పించాలని రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాలకు హోం శాఖ తగిన ఆదేశాలు జారీచేసిందని తెలిపారు. ఆహారం, నీరు, వైద్య సిబ్బందితో పరీక్షలు చేయించడం లాంటి విధులు నిర్వహించిందని సింగ్ పేర్కొన్నారు. కాలినడకన వెళ్లేవారికి ఆహారం అందజేసి.. తాగునీరు ఇచ్చి వారికి తోడ్పాటును కలుగజేసిందని తెలిపారు. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకొని.. విశ్రాంతి కల్పించిందని చెప్పారు. ఏప్రిల్ 29, మే 1వ తేదీన బస్సులు, శ్రామిక్ రైళ్ల ద్వారా కార్మికులను స్వస్థలాలకు తరలించారని పేర్కొన్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications