ట్రాక్టర్ను ఢీకొన్న రైలు: పది మంది మృతి, 30 మందికి గాయాలు
బిజ్నోర్: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. మానవరహిత రైలు రోడ్డు క్రాసింగ్ వద్ద ట్రాక్టర్ను రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు బుధవారం చెప్పారు. ఈ ప్రమాదంలో పది మంది మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు.
ప్రయాణికులతో క్రిక్కిరిసి ఉన్న ట్రాక్టర్ వ్యాగన్ పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ సమీపంలో మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సంభవించింది.

వ్యాగన్లో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. వారంతా గంగానది సమీపంలోని ఓ పవిత్ర స్థలానికి వెళ్లి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో 33 మంది గాయపడ్డారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
మీరట్లోని ఆస్పత్రిలో క్షతగాత్రులను చేర్చి, చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు 350 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మానవరహిత లెవెల్ క్రాసింగ్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించింది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications