Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యాత్రికుల బస్సుపై ఉగ్ర కాల్పులు: లోయలో పడి 10 మంది మృతి, 30 మందికిపైగా గాయాలు

శ్రీనగర్: ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య కారణంగా 10 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. రియాసీ జిల్లాలో యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్ర మూకలు కాల్పులు జరపడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు లోతైన లోయలో పడినట్లు అధికారులు తెలిపారు.

పది మంది ప్రాణాలు కోల్పోగా, 30 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. శివఖోరీ ఆలయానికి వెళ్తున్న క్రమంలో బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినట్లు పేర్కొన్నారు. ఘటనాస్థలంలో పారామిలటరీ, సైన్యం సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడినవారిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు.

10 killed as bus falls into gorge in Jammu and Kashmir after terror attack

ఉగ్రదాడుల నేపథ్యంలో రియాసీ జిల్లాతోపాటు పరిసర ప్రాంతాల్లో భద్రతా దళాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. రహదారులపై వాహనాలను తనిఖీలు చేసి పంపిస్తున్నారు. దాడులు జరిగిన ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారు.

ఓ వైపు మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ఈ ఉగ్రవాదులు జరగడం గమనార్హం. ఉగ్రదాడులను ఖండిస్తూనే నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే. ఉగ్రదాడులను ఖండిస్తున్నట్లు చెప్పిన ఖర్గే.. మోడీ ప్రభుత్వం ప్రజలకు భద్రత కల్పించాలన్నారు. శాంతి భద్రతలు కాపాడాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. ఇటీవల కాలంలో యాత్రికులపై దాడులు పెరిగాయన్నారు. మోడీ ప్రభుత్వం చెప్పినట్లుగా జమ్మూకాశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం ఏమీ లేదని విమర్శించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+