వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోర రోడ్డు ప్రమాదం: 11 మంది దుర్మరణం

|
Google Oneindia TeluguNews

ఐజ్వాల్: మిజోరాం రాష్ట్రంలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లంగ్లేయ్‌ జిల్లాలో ఏజ్వాల్‌ నుంచి లాంగ్‌ట్లాయ్‌ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 11మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 21 మందికి తీవ్రగాయాలయ్యాయి.

మృతుల్లో ఇద్దరు గర్భిణులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో డ్రైవర్‌ బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. గాయపడినవారిని స్థానిక సెర్చిప్‌ జిల్లా థెంజ్వాల్‌ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

11 Killed in Mizoram Bus Accident

క్రాఫోర్డ్ ఫుడ్ మార్కెట్‌లో అగ్నిప్రమాదం

ముంబైలోని క్రాఫోర్ట్ ఫుడ్ మార్కెట్‌లో ఆదివారం ఉదయం 5.30 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో మార్కెట్‌లోని పలు షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి.

10 ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు దర్యాప్తులో బయటపడుతాయని చెప్పారు.

English summary
Eleven people were killed and 21 others injured when a bus fell into a deep gorge in south Mizoram's Lunglei district, police said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X