ఘోర రోడ్డు ప్రమాదం: 11 మంది దుర్మరణం
ఐజ్వాల్: మిజోరాం రాష్ట్రంలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లంగ్లేయ్ జిల్లాలో ఏజ్వాల్ నుంచి లాంగ్ట్లాయ్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 11మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 21 మందికి తీవ్రగాయాలయ్యాయి.
మృతుల్లో ఇద్దరు గర్భిణులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో డ్రైవర్ బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. గాయపడినవారిని స్థానిక సెర్చిప్ జిల్లా థెంజ్వాల్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
క్రాఫోర్డ్ ఫుడ్ మార్కెట్లో అగ్నిప్రమాదం
ముంబైలోని క్రాఫోర్ట్ ఫుడ్ మార్కెట్లో ఆదివారం ఉదయం 5.30 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో మార్కెట్లోని పలు షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి.
10 ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు దర్యాప్తులో బయటపడుతాయని చెప్పారు.