ఒడిషా రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం
భువనేశ్వర్: ఒడిషా రాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించారు. ప్రయాణికులతో వెళ్తున్న మినీ ట్రక్కు రోడ్డు పక్కన గల చెట్టును ఢీకొట్టింది. దీంతో ట్రక్కులో ప్రయాణిస్తున్న 11 మంది మరణించారు. ఆ సంఘటన ఒడిషాలోని నవరంగ్పూర్ జిల్లాలో జరిగిందని పోలీసులు శనివారం చెప్పారు.
శుక్రవారం పర్వతాలు, అడవులతో కూడిన ఝరిగావ్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 12 మందికి పైగా గాయపడ్డారు. భువనేశ్వర్కు 700 కిలోమీటర్ల దూరాన ఆ ప్రాంతం ఉంది. మినీ ట్రక్కులో 50 మందికి పైగా ప్రయాణికులు ప్రమాదానికి గురైన వాహనంలో ఉన్నారు.

దబుగావ్ నుంచి చండహండీకి వెళ్తుండగా మినీ ట్రక్కు ప్రమాదానికి గురైంది. ప్రయాణికులు స్థానిక ఒపెరా ట్రూప్నకు చెందినవారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం చెట్టుకు ఢీకొట్టింది.
ప్రమాదంలో 30 మంది దాకా గాయపడ్డారు. జిల్లా అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications