వారణాసిలో విషాదం: తొక్కిసలాటలో 24 మంది మృతి
వారణాసి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. వారణాసిలోని రాజ్ఘాట్ వంతెనపై తొక్కిసలాట చోటు చేసుకుంది. శనివారం జరిగిన ఈ ఘటనలో 24 మంది మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

జయగురుదేవ్ ఉత్సవంలో పాల్గొనడానికి పెద్ద యెత్తున ప్రజలు వచ్చారు. ఈ సందర్భంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.జై గురుదేవ్కు నివాళులు అర్పించడానికి గంగానదిపై గల రాజ్ఘాట్పైకి పెద్ద యెత్తున ప్రజలు వచ్చారు. ఇరుకు రోడ్లపైకి ఒక్కేసారి పెద్ద యెత్తున ప్రజలు చేరుకున్నారని, అనుమతికి మించి వచ్చారని అధికారులు చెప్పారు.
వంతెన కూలిందనే పుకార్లు బయలు దేరడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. సహాయక చర్యలు సాగుతున్నాయి. చెప్పులు, దుస్తులు చెల్లాచెదురుగా పడిపోయాయి. పలు అంబులెన్సులు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
మృతుల్లో 15 మంది మహిళలే కావడం గమనార్హం. తొక్కిసలాట జరిగిన వెంటనే బాధితులకు వైద్య సాయం అందించడంలో జాప్యం జరిగింది. దీంతో మరణాలు ఎక్కువ సంఖ్యలో సంభవించాయని అనుకుంటున్నారు. ఎలాంటి జాగ్రత్తలు లేకుండానే సభ ఏర్పాటు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యసాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications