వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆయుధ కర్మాగారంలో భారీ పేలుడు: 19మంది మృతి
ముంబై: మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ మందుగుండు సామాగ్రి డిపోలో పేలుడు సంభవించడం వల్ల ఇద్దరు ఆర్మీ ఆఫీసర్లు సహా పదిహేడు మంది మృతి చెందారు. ఈ సంఘటన పాల్గన్లో ఈ రోజు చోటు చేసుకుంది.
సైనిక ఆయుధ కర్మాగారంలో ఈ భారీ ప్రమాదం సంభవించింది. కర్మాగారంలో ఉదయం భారీ పేలుడు జరగడంతో అక్కడే పని చేస్తున్న వారు కాలి బూడిదయ్యారు. మరో పందొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
పేలుడు కారణంగా ఎగసిపడుతున్న మంటలు శరవేగంగా విస్తరిస్తున్న క్రమంలో సమీపంలోని దాదాపు వెయ్యి మంది గ్రామ ప్రజలను పోలీసులు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ప్రమాదం సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒకటి గంటలకు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
Comments
English summary
Two officers are among 17 army personnel killed in a massive fire at an ammunition depot in Maharashtra's Pulgaon.
Story first published: Tuesday, May 31, 2016, 10:19 [IST]