ఇతర పార్టీలను ఉడ్చేసినా టాప్ 3లో లేని కేజ్రీవాల్
న్యూఢిల్లీ: జాతీయ పార్టీలు కాంగ్రెసు, బిజెపిలను ఊడ్చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీలో విజయం సాధించిన అభ్యర్థుల మెజారిటీతో అగ్రస్థానంలో లేరు. ఆయన టాప్-3లో చోటు దక్కించుకోలేకపోయారు. వాయువ్య ఢిల్లీ నుంచి పోటీచేసిన ఆప్ అభ్యర్థి సందీప్ కుమార్ బీజేపీ అభ్యర్థి ప్రభు దయాళ్పై 64,439 ఓట్ల భారీ తేడాతో గెలిచి మొదటిస్థానంలో ఉన్నాడు.
దక్షిణ ఢిల్లీలోని దియోలీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆప్ మరో అభ్యర్థి ప్రకాశ్ బీజేపీ అభ్యర్థి అరవింద్ కుమార్పై 63,937 ఓట్ల తేడాతో గెలుపొంది రెండోస్థానంలో నిలిచాడు. ఆప్కే చెందిన వేద్ ప్రకాశ్ బీజేపీ అభ్యర్థి గుజన్సింగ్పై 50,023 ఓట్ల తేడాతో గెలుపొందాడు. కాగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన కేజ్రీవాల్ బీజేపీ అభ్యర్థి నుపూర్ శర్మపై 31,583 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.

ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ ఏకపక్షంగా విజయం సాధించి ఢిల్లీ సీఎం పీఠాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. వరుస ఎన్నికల విజయాలతో జోరుమీదున్న బీజేపీకి ఢిల్లీ ఎన్నికల ఫలితాల వెల్లడితో బ్రేక్ పడింది. ఆపార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది.
70 స్థానాలు ఉన్న ఢిల్లీ శాసనసభలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 7 స్థానాలను గెలుపొందాలి. బీజేపీ మూడు అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. కాగా కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక సీటును కూడా కైవసం చేసుకోలేకపోయింది.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications