ఘోర ప్రమాదం: లోయలో పడిన బస్సు, 21 మంది మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జమ్మూ-పూంఛ్ రహదారిపై వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి భారీ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా, మరో 40 మంది గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న రక్షణ బలగాలు.. అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
లోయలో పడి నుజ్జునుజ్జయిన బస్సు నుంచి పలువురి మృతదేహాలను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని ఆస్పత్రుల్లో సహాయక బృందాలు చేర్పించాయి. బస్సులో 80 మందికి పైగా ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హథ్రాస్ నుంచి ప్రయాణికులతో బయల్దేరిన బస్సు.. జమ్మూ జిల్లాలోని అఖ్నూర్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. జమ్మూ-పూంఛ్ రహదారిపై అదుపుతప్పి లోయలోపడిపోయిందని పోలీసు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్రంగా బాధించిందని.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ప్రార్థించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications