వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో పట్టాలు తప్పిన వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్: ముగ్గురు మృతి

ఉత్తర ప్రదేశ్‌లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, తొమ్మిది మంది వరకు గాయపడ్డారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Vasco Da Gama Patna-Express derailed, Watch

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్రాకూట్‌ జల్లాలోని మానిక్‌పూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ ప్రయాణికుల రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు.

చిత్రాకూట్‌ నుంచి పట్నా వెళ్తున్న వాస్కోడిగామా-పట్నా ఎక్స్‌ప్రెస్‌ శుక్రవారం తెల్లవారుజామున 4.18 గంటలకు ప్రమాదానికి గురైంది. రైలు మాణిక్‌పూర్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే 13 బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారమందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

2 dead after Vasco da Gama Express derails in UP

ఈ ఘటనలో బీహార్‌కు చెందిన తండ్రీకొడులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది గాయపడగా.. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్‌ దెబ్బతినడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.

English summary
Three persons have died and 9 others injured after 13 coaches of the Vasco da Gama express derailed in Uttar Pradesh. The incident took place early Friday morning. The incident took place near Banda in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X