జయలలిత రూ. 100 కోట్లు ఎలా కడతారు...?
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతున్నాయి. బెంగుళూరులోని పరప్పన అగ్రహారంలోని ప్రత్యేక న్యాయస్దానం అక్రమాస్తుల కేసులో వెలువరించిన తీర్పులో జయలలితకు నాలుగేళ్లు జైలు శిక్షతోపాటు రూ. 100 కోట్లు జరిమానా చెల్లించాలని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ తీర్పు జయలలితకు మరో సమస్య తెచ్చి పెట్టింది. గత అసెంబ్లీకి జరిగిన ఎన్నికల సందర్బంగా జయ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తన కున్న ఆస్తుల మొత్తం రూ. 51 కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. దాంతో ఇంత పెద్ద మొత్తంలో ఆమె జరిమానాను ఎలా చెల్లిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిటి ప్రకారం జయలలిత ఆస్తులు (రూపాయల్లో)
నగదు - 25,000
డిపాజిట్లు - 2,04,17,979
బాండ్లు - 50,000
వాహనాలు - 8,35,000
పెట్టుబడులు - 10,90,00,000
సాగుభూమి - 11,25,00,000
భవనాలు - 6,91,40,000
గృహాలు - 20,16,00,000












Click it and Unblock the Notifications