మరో వడ్డన.. ఇక ఆటో వంతు.. అన్నీ ఆటోలు కాదు..
సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. ఇప్పటికే నిత్యవసర వస్తుల ధరలపై జీఎస్టీని పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు మరో నిర్ణయం తీసుకుంది. ఆటోలో ప్రయాణించే వారిపై జీఎస్టీ విధించనున్నాయి. ఆటో ఎక్కినా ఇకపై చార్జీకి అదనంగా జీఎస్టీ చెల్లించాల్సిందే. ఆటో రిక్షా బుకింగ్ పై 5 శాతం జీఎస్టీ వసూలుకు నిర్ణయించింది.

జీఎస్టీ సాధారణంగా నడిచే షేర్, ఇతర ఆటోలు కాదని స్పష్టంచేసింది. దీంతో మెజార్టీ మంది ఊపిరి పీల్చుకున్నారు. కేవలం రైడ్ షేరింగ్ కంపెనీలు ఓలా, ఊబర్ సంస్థల సేవలందించే ఆటోల్లో ప్రయాణించే వారికి మాత్రమే జీఎస్టీ వర్తిస్తుందని తెలిపింది. ఇదీ ఊరట కలిగించే అంశం.. ఆయా సంస్థలు.. కేవలం మెట్రో నగరాల్లో మాత్రమే ఉండేవి. చిన్న నగరాలకు ఇంకా వ్యాపించలేదు. సో దీంతో ఎక్కువ మంది బాధపడరు.. కానీ కొందరు మాత్రం ఇబ్బంది పడటం సహాజమే కానుంది.
5 శాతం జీఎస్టీకి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం ఈ నెల 18వ తేదీన ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ కొత్త జీఎస్టీ నిబంధనలు వచ్చే ఏడాది అంటే 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఇప్పటి వరకు ఈ కామర్స్ ఆటో రిక్షా బుకింగ్పై జీఎస్టీ మినహాయింపు ఉండేది. దానిని ఇప్పుడు కేంద్రం ఉప సంహరించుకుంది. దీంతో ఈ కామర్స్ మీద బుక్ చేసే వారు మాత్రం.. తప్పకుండా 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications