coronavirus: బీర్ అనుకొని యాసిడ్ తాగి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి...
కరోనా వైరస్తో దేశవ్యాప్తంగా రెండో విడత లాక్డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నెల 20వ తేదీ వరకు ఆంక్షలు కఠినంగా అమలు చేస్తారు. అయితే తర్వాత నిబంధనలను సడలిస్తారు. 20వ తేదీ వరకు మధ్యప్రదేశ్లో లిక్కర్ షాపులు మూసి ఉంటాయి. ముందు దొరకడం లేదో అనో ఏమో గానీ.. ఓ వృద్దుడు బీర్ అనుకొని యాసిడ్ తాగాడు. పరిస్థితి విషమించి చనిపోయాడు.
భోపాల్లోని టీటీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో సురేష్ సజాల్కర్ అనే వ్యక్తి ఉంటున్నాడు. అయితే సోమవారం రోజున ఆయనకు బీర్ బాటిల్ కనిపించింది. అయితే అందులో బీర్ బదులు.. యాసిడ్ ఉంది. అది గమనించిన సురేశ్.. బీర్ అనుకొని తాగాడు. నోట్లో పడ్డాక గానీ తెలియలేదు. అది యాసిడ్ అని.. తర్వాత అరుపులు పెడబొబ్బులతో ఇరుగు పొరుగువారికి తెలిసింది. వెంటనే అతనిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

కానీ ఫలితం లేకపోయింది. ఆయన బుధవారం చనిపోయాడని పోలీసులు పేర్కొన్నారు. మందు అనుకొని.. యాసిడ్ తాగడం కలకలం రేపగా... అతను చనిపోవడం ఆ ఇంట్లో విషాదం నింపింది. మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించగా.. అప్పటివరకు షాపింగ్ మాల్స్ క్లోజ్ చేస్తామని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టంచేశారు.అయితే ఏప్రిల్ 20 తర్వాత మాత్రం వైన్ షాపులు తెరుస్తామని తేల్చిచెప్పారు. లాక్ డౌన్ ప్రకటించినప్పటీ నుంచి రాష్ట్రంలో వైన్ షాపులను మూసివేసిన సంగతి తెలిసిందే.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!










Click it and Unblock the Notifications