చెన్నైలో భారీగా బంగారాన్ని స్వాధీనం ,ఓ వ్యక్తి అరెస్టు
శ్రీలంక నుండి అక్రమంగా బంగారాన్ని తరిస్తుండగా ఓ వ్యక్తి ఈడీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. నిందితుడి నుండి 8.7 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు. దీని విలువ సుమారు 2.44 కోట్లు ఉంటుందని అధికారు
చెన్నై :తమిళనాడు రాష్ట్రంలో భారీగా బంగారాన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడి నుండి సుమారు 8.7 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు.
సుమారు 2.44 కోట్ల విలువైన బంగారాన్ని శ్రీలంలో నుండి తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలోని మండపానికి తరలిస్తుండగా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.
ఈ ఘటన కంటే ముందు కోస్టల్ సెక్యూరిటీ గ్రూప్ (సిఎస్ జి) అధికారులు బంగారం బిస్కట్లను తరలిస్తుండగా ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ బంగారం బిస్కట్ల బరువు సుమారు 35 కిలోల వరకు ఉంది.
సముద్ర మార్గం ద్వారా శ్రీలం నుండి ఇద్దరు వ్యక్తులు ఈ బంగారాన్ని తరలిస్తున్నారు.అయితే ఇందులో ఓ వ్యక్తిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబందించిన పూర్తివివరాలు రావాల్సి ఉంది.
Comments
English summary
one person was arrested , seized 8.7 kg of gold worth 2.44 crore smuggled from srilanka at mandapam near rameswaram.
Story first published: Sunday, January 1, 2017, 15:25 [IST]