వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవవధువు ప్రాణం తీసిన చున్నీ: గ్రైండర్ లో చిక్కుకుని !

కేరళలోని కాసరగూడు జిల్లాలోని శిరియా పట్టణంలో ఆయేషా (21) అనే నవవధువు గ్రైండర్ లో బియ్యం రుబ్బుతున్న సమయంలో ఆకస్మికంగా ఆమె వేసుకున్న చున్నీ వేగంగా తిరుగుతున్న గ్రైండర్ లో పడి గొంతు బిగుసుకుపోయి ఊపిరాడక

|
Google Oneindia TeluguNews

కాసరగూడు: గ్రైండర్ లో బియ్యం రుబ్బుతున్న మహిళ అందులో చున్నీ చిక్కుకుని గొంతు బిగుసుకుని ఊపిరాడక ప్రాణాలువిడిచిన ఘటన కేరళలోని కాసరగూడు జిల్లాలోని శిరియా పట్టణంలో జరిగింది.

శిరియా పట్టణంలో సయ్యద్, ఆయేషా మున్ఫా (21) దంపతులు నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి సయ్యద్ బయటకు వెళ్లారు. ఇంటిలో ఆయేషా మున్ఫా, ఆమె అత్తా, మామ ఉన్నారు. తరువాత ఆయేషా గ్రైండర్ లో బియ్యం వేసింది.

A 21-year-old woman died in a freak accident after her dupatta got trapped in a grinder at a home in Kasargod.

బియ్యం రుబ్బడానికి గ్రైండర్ స్విచ్ ఆన్ చేసింది. గ్రైండర్ వేగంగా తిరుగుతున్న సమయంలో ఆయేషా మెడలో వేసుకున్న చున్నీలోని ఒక భాగం గ్రైండర్ లో పడిపోయింది. గ్రైండర్ వేగంగా తిరుగుతున్న సమయంలో చున్నీ ఆయేషా మెడుకు బిగుసుకుపోయింది.

ఆయేషా కేకలు వెయ్యడంతో ఆమె అత్తా, మామ వెంటనే గ్రైండర్ స్వీచ్ ఆఫ్ చేసి ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయేషా ఊపిరాడక మరణించిందని వైద్యులు దృవీకరించారు. ఆరు నెలల క్రితమే సయ్యద్, ఆయేషాల వివాహం జరిగిందని పోలీసులు తెలిపారు.

English summary
A 21-year-old woman (ayesha munaf) died in a freak accident after her dupatta got trapped in a grinder at a home in Shiriya, Kasargod district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X