Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అధికార పార్టీకి షాక్ ఇచ్చిన ‘అఖండ’, దెబ్బకు ప్రతిపక్షంతో చేతులు కలిపిన మాస్ లీడర్ !

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లు హోరాహోరీగా ప్రచారం చేయడంతో రాజకీయ పార్టీల వేదికకు రణరంగంగా మారింది. కర్ణాటకలోని 28 లోక్‌సభ నియోజకవర్గాల్లో 28 స్థానాల్లో విజయం సాధించి అధికార కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌ వేసింది. అయితే కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా బీజేపీ ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది.

బెంగళూరులోని పులకేశీనగరకు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, మాస్ లీడర్ అఖండ శ్రీనివాసమూర్తిని ఎంకరేజ్‌ చేసి బీజేపీలో చేర్చుకోవడంతో ఆ పార్టీ నాయకులు విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల తేదీ ఇప్పటికే ప్రకటించడంతో ఎన్నికల ప్రచారానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజేతో పాటు పలువురు నేతలు కొద్దిరోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్ మూర్తి నివాసానికి వెళ్లి ఆయనను బీజేపీ పార్టీలోకి తీసుకురావాలని చర్చలు జరిపారు.

A former Congress MLA from Bengaluru who joined the BJP in the presence of Yeddyurappa

శ్రీరామనవమి రోజు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్ మూర్తి బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేని బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గంలో ఎంపీగా గెలిపించడానికి బీజేపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్బంలో కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప మాట్లాడుతూ శోభా కరంద్లాజే 2.5 లక్షల నుంచి 3 లక్షల ఓట్ల తేడాతో ఆమె ఎంపీగా గెలుపొందడం ఖాయమని అన్నారు.

కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర పార్లమెంటరీ బోర్డు వ్యవహారాల సభ్యుడు బీఎస్.యడ్యూరప్ప స్వయంగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఎన్నికల సమయంలో అఖండ శ్రీనివాసమూర్తి బీజేపీలో చేరికతో పార్టీకి ఎంతో బలం చేకూరిందని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప అన్నారు. బెంగళూరులోని డీజే హళ్లి-కేజీ హళ్లిలో హిందూ, ముస్లిం అల్లర్లు జరిగినప్పుడు మాజీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇల్లు దగ్ధమైంది.

అప్పుడు సొంత పార్టీ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తికి ఏమాత్రం మద్దతు ఇవ్వలేదు. అప్పుడు అఖండ శ్రీనివాసమూర్తికి అండగా నిలబడ్డామని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప ఇదే సమయంలో గుర్తు చేశారు. అఖండ శ్రీనివాసమూర్తి మద్దతుదారులతో పార్టీలో చేరడంతో బీజేపీకి మరింత బలం చేకూర్చినట్లయింది. మీ అందరి తరపున అఖండ శ్రీనివాసమూర్తికి స్వాగతం అని బీఎస్ యడియూరప్ప అన్నారు.

అఖండ శ్రీనివాస మూర్తి బెంగళూరులోని బీజేపీ కార్యాలయంలో బీజేపీలో చేరిన సందర్బంగా ఆ పార్టీకి చెందిన జాతీయ స్థాయి నాయకులు, కర్ణాటక రాష్ట్ర నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో రగిలిపోయిన అఖండ శ్రీనివాసమూర్తి అప్పటికప్పుడు బీఎస్పీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి అఖండ శ్రీనివాసమూర్తి ఆ పార్టీలో చేరిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+