ఐఫోన్ కోసం కన్నబిడ్డను బేరానికి పెట్టిన తల్లి ..!
కోల్ కత్తా/పశ్చిమ బెంగాల్: ఇప్పుడు యూట్యూబర్ల హల్ చల్ నడుస్తోంది. ఇటీవల చూసిన కంటెంట్ క్రియేటర్లు, నగరాల నుంచి గ్రామాలకు రీళ్లు, వీడియోలు పెరిగిపోయాయి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేస్తే సరిపడా ఆదాయం వస్తుందని అందరికి తెలిసిపోయింది. అందుకే చాలా మంది తమ దైన జీవితంలో గడిపేస్తున్నారు.
ఇటీవల చాలా మంది రీల్స్ చేయడం ప్రారంభించారు. అందుకే వారు బెస్ట్ కెమెరా క్వాలిటీ ఉన్న ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. ఇలా రీల్స్ చేసే చాలా మంది ఐఫోన్ పై ఆధారపడుతున్నారు. మంచి ఫోటో మరియు విజువల్ క్లారిటీ కారణంగా ఖరీదైన వ్యక్తులు ఐఫోన్ను కొనుగోలు చేస్తారు. కొంతమంది ఐఫోన్ కొనడానికి డబ్బు ఆదా చేస్తారు. అయితే ఇన్స్టాగ్రామ్ రీల్స్ను చేయడానికి ఐఫోన్ 14 కొనడానికి పశ్చిమ బెంగాల్ దంపతులు తమ 8 నెలల శిశువును విక్రయించడం కలకలం రేపింది.

అతను పసిబిడ్డ అని కూడా ఆలోచించకుండా మరో బిడ్డను కనదామని ఆ బిడ్డను విక్రయించి ఐఫోన్ను కొనుగోలు చేసి ఆ ఫోన్ ద్వారా ఇన్స్టాగ్రామ్ రీల్స్ను చేయాలనుకున్నారు. పశ్చిమ బెంగాల్ మొత్తం తిరుగుతూ రీళ్లు తయారు చేసి డబ్బు సంపాదించవచ్చని ఆ దంపతులు భావించి కనుక్కున్న బిడ్డను అమ్మేశారు.
పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర పరాగుణ జిల్లాలో జయదేవ్ ఘోష్, సతి ఘోష్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు 8 నెలల కుమారుడు ఉన్నాడు. కూలినాలి చేసుకుంటున్న దంపతులు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నారు. నిత్యం రీల్స్ చేస్తున్న దంపతులు ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇటీవల దంపతుల 8 కుమారుడు కనిపించకుండాపోయాడు. కుమారుడు కనపడటం లేదని దంపతులకు ఎలాంటి ఫీలింగ్ లేదని చుట్టుపక్కల వాళ్లు గమనించారు. అంతే కాకుండా దంపతుల దగ్గర ఖరీదైన మొబైల్ ఫోన్ ఉండటం, దంపతులు ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్లి రీల్స్ చేస్తూ యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తుండటంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు స్థానిక కౌన్సిలర్ తారక్ గుహకు సమాచారం అందించారు. కౌన్సిలర్ పోలీసులను విచారణకు ఆదేశించారు. పోలీసులు విచారించగా తల్లి తన బిడ్డను ఐఫోన్ కోసం అమ్మినట్లు అంగీకరించింది. గతంలో తన 7 ఏళ్ల కూతురిని విక్రయించేందుకు ప్రయత్నించినట్లు కూడా వెలుగులోకి వచ్చింది.
దంపతులపై స్థానికులు పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు. 8 నెలల పాపను కొనుగోలు చేసిన మహిళపై కూడా మానవ అక్రమ రవాణా కేసు నమోదైంది.తన బిడ్డ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే తల్లుల నడుమ ఐఫోన్ కొనుక్కోవడానికి తన బిడ్డను అమ్మేసిన ఆమె మాతృ వంశానికే అవమానం అని స్థానికులు మండిపడుతున్నారు. బిడ్డను అమ్మేసిన తల్లిని అరెస్టు చెయ్యడంతో తండ్రి మాత్రం తప్పించుకుని తిరుగుతున్నాడు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications