పవన్ కళ్యాణ్ పై దేశద్రోహం కేసు పెట్టాలట.. ఆ పార్టీ అధినేత డిమాండ్!

తెలంగాణ రాజకీయాల్లో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో వివాదం కొనసాగుతుంది. ఇదే సమయంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ భావాలను గాయపరిచాయని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతీయవాదులను ఉగ్రవాదులు, వేర్పాటువాదులతో సమానం చేసి మాట్లాడినందుకు పవన్‌పై దేశద్రోహం కేసు పెట్టాలని కవిత డిమాండ్ చేశారు.

పవన్ కళ్యాణ్ చేసినవి ప్రాంతీయ భావాలను అవమానించే వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో తెలంగాణ రక్షణ సేన జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొని తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ప్రజలు సంబరాలు చేసుకుంటుంటే, పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి ప్రాంతీయ భావాలను అవమానించే వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు.

ap deputy cm Pawan kalyan has targeted by TRS President Kavitha demands to file sedition case

పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతీయవాదాన్ని వేర్పాటువాదంతో పోల్చడం హేయం

ఢిల్లీలో జరిగిన సేన ప్రస్థానం కార్యక్రమంలో పవన్ చేసిన ప్రసంగం తెలంగాణవాదుల మనోభావాలను గాయపరిచిందని ఆమె ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడూ వేర్పాటువాదం గురించి ఎవరూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతీయవాదాన్ని వేర్పాటువాదంతో పోల్చడం తీవ్ర దురుద్దేశపూర్వకమని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలపై కేసు నమోదు చేయకపోవడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన చేతగానితనాన్ని చాటుతోందని ఆరోపించారు.

ఆంధ్రవాసులకు ఒక న్యాయం, తెలంగాణవాసులకు మరొక న్యాయమా?

తెలంగాణ సర్కారు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే వెంటనే పవన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.చిన్న చిన్న సంఘటనలపై సామాన్యులు, సింగరేణి కార్మికులపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు, ఆంధ్ర నేతలు మరియు సినిమా వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రవాసులకు ఒక రకమైన న్యాయం, తెలంగాణవాసులకు మరొక రకమైన న్యాయం అమలు చేస్తున్నారా అని ఆమె మండిపడ్డారు.

ఈ సర్కారీ స్కూల్స్ లో నో అడ్మిషన్స్ బోర్డులు.. సీట్ల కోసం తల్లిదండ్రుల పాట్లు!
ఈ సర్కారీ స్కూల్స్ లో నో అడ్మిషన్స్ బోర్డులు.. సీట్ల కోసం తల్లిదండ్రుల పాట్లు!

ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించిన కవిత

తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను గౌరవించకపోవడం, కరీంనగర్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయకపోవడం వంటి అంశాలను కూడా ప్రస్తావించి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. మరి కవిత డిమాండ్ పైన తెలంగాణా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+