ఐరాసలో పాక్‌కు భారత్ బిగ్ షాక్..!

ఐరాస వేదికగా పాకిస్థాన్ దేశంపై భారత్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పాకిస్థాన్ ను ఓ 'ఫ్రాంకెన్‌స్టెయిన్ దేశం'గా అభివర్ణించిన భారత్.. తాను పెంచి పోషించిన ఉగ్రవాద భూతమే తనను తిరిగి కాటేస్తుంటే ఆ దేశం ఆశ్చర్యం వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేసిది. ఐరాస హైకమిషనర్ వార్షిక నివేదికపై జరిగిన ఇంటరాక్టివ్ డైలాగ్‌లో ఐరాసలోని భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ అనుపమ సింగ్ పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, శిక్షణ ఇవ్వడం, వారిని మోహరించడం పాక్ నైజమని ఆమె దుయ్యబట్టారు.

ఐరాస ఫోరమ్‌లో పాకిస్థాన్ ప్రతినిధి జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన నేపథ్యంలో భారత్ తన సమాధానం చెప్పే హక్కును వినియోగించుకుంది. జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని అనుపమ సింగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ఏకైక పరిష్కారం కాని సమస్య.. భారత భూభాగాలను పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకోవడం, వాటిని తిరిగి భారత్ కు అప్పగించడమేనని ఆమె తేల్చి చెప్పారు.

India Slams Pakistan at United Nations Calls It a Frankenstein State Over Terrorism and Indus Water Treaty updates

పీవోకేలో జరుగుతున్న అణచివేతను ప్రస్తావిస్తూ పాకిస్థాన్ చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని భారత్ తిప్పికొట్టింది. ఇటీవల రావల్కోట్‌లో జరిగిన ఘర్షణల్లో నలుగురు పోలీసులతో సహా 11 మంది మరణించగా.. వందలాది మంది గాయపడ్డారు. దశాబ్దాలుగా సాగుతున్న సైనిక భూకబ్జాలు, బలవంతపు ఆక్రమణల వల్లే ఈ దుస్థితి దాపురించిందని అనుపమ సింగ్ పేర్కొన్నారు. అక్కడ కనీస హక్కులు, విద్యుత్, ఆహారం కోసం ప్రజలు చేస్తున్న డిమాండ్లను కూడా బుల్లెట్లు, క్రూరత్వంతో అణచివేస్తున్నారని ఆమె విమర్శించారు.

ఉగ్రవాదాన్ని ఓ ప్రభుత్వ విధానంగా వాడుకుంటూ.. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లు పాకిస్థాన్ రక్షణ మంత్రి స్వయంగా గొప్పలు చెప్పుకుంటారని.. అయినప్పటికీ పాక్ తనను తాను ఉగ్రవాద బాధితురాలిగా చెప్పుకోవడం సిగ్గుపడాల్సిన విషయం అంటూ భారత్ మండిపడింది. అలాగే పాకిస్థాన్ తో సింధు నదీ జలాల ఒప్పందంపై కూడా భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. గతేడాది పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించిన తర్వాత ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే దేశం, స్నేహపూర్వక సహకారాన్ని ఆశించడం తగదని భారత్ స్పష్టం చేసింది. 1960లో కుదిరిన ఈ ఒప్పందం కాలగమనంలో పాతబడిపోయిందని.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణం మార్పులు అవసరమని అనుపమ సింగ్ ఐరాస వేదికగా స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+