చెరువులో శవం అయిన కాబోయే పెళ్లికొడుకు. రాత్రి ఏం జరిగిందంటే ?
బెంగళూరు/ధారవాడ: వచ్చే నెలలో పెళ్లి తేదీని నిర్ణయించిన యువకుడు చాలా సంతోషంగా ఉంటున్నాడు. తనకు పెళ్లి జరుగుతోందని, అందరూ పెళ్లికి రావాలని ఇప్పటికే ఆ యువకుడు అతని స్నేహితులకు ఫొన్లు చేసి చెప్పాడు. అయితే ఆ యువకుడు ఒక్కసారిగా కనపడకుండా పోయాడు. పెళ్లి చేసుకుంటున్న యువతి కూడా విషయం తెలుసుకుని హడలిపోయింది.
కర్జాటకలోని ధారవాడ సిటీ శివార్లలోని యువకనోర్వా గ్రామం సమీపంలోని ఓ చెరువులో పెళ్లి కొడుకు శవమై కనిపించాడు.
పెళ్లి చేసుకోబోయే యువకుడు అతనికి కాబోయే భార్యను చూసి చాలా సంతోషించాడు. వచ్చే నెలలో పెళ్లి జరగనుండడంతో వరుడు, యువకుడితో సహా కుటుంబసభ్యులంతా పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారు.

అయితే పెళ్లికి సిద్ధమవుతున్న యువకుడు హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. దీంతో భయాందోళనకు గురైన యువకుడి కోసం అతని కుటుంబ సభ్యులు చాలా ప్రాంతాల్లో వెతికారు. అయితే గ్రామం వెలుపల ఉన్న సరస్సు ఒడ్డున యువకుడి బట్టలు, చెప్పులు కనిపించాయి. ఆ యువకుడు చెరువులో మునిగి మృతి చెందిఉంటాడనే అనుమానం రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు.
అగ్నిమాపక సిబ్బంది యువకుడి కోసం బోటు ద్వారా ఆపరేషన్ నిర్వహించారు. కొద్దిసేపటి తర్వాత పెళ్లికొడుకు శవమై కనిపించాడు.
మృతి చెందిన యువకుడిని ధారవాడ సిటీలోని కంఠిగల్లికి చెందిన మల్లిక్ (30)గా గుర్తించారు. జూన్ 18న అతని వివాహం జరగాల్సి ఉంది. అయితే ఇదే సమయంలో మల్లిక్ చెరువులో శవమై కనిపించడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
యువకుడు మల్లిక్తో పాటు ఎవరెరువు చెరువు వద్దకు వెళ్లారు అని సమాచారం లేదని పోలీసులు అంటున్నారు. మల్లిక్ చావుపై అనుమానం వ్యక్తం చేసిన అతని కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు. రెండు వారాల్లో పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు శవమై కనిపించడం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని మల్లిక్ కుటుంబ సభ్యులు అంటున్నారు.












Click it and Unblock the Notifications