అడవిలో యువతిని ఏం చేశాడంటే ?, ఫోన్ చేసి పిలిపించి, ఇలాంటి శాడిస్టు ఉంటాడా ?
అనుమానాస్పదంగా అదృశ్యమైన యువతి శవమై కనిపించిన కేసును కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని అగుంబే పోలీసులు చేదించారు. యువతిని హత్య చేసింది తానే అని నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతిని నమ్మించి ఆమెను పక్కాప్లాన్ తో హత్య చేసిన నిందితుడికి హత్య చేసిన ఫీలింగ్ ఏమాత్రం లేదని పోలీసు అధికారులు అంటున్నారు
కుశాల్ అనే వ్యక్తి కుమార్తె పూజా(24) జూన్ 30వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి అనుమానాస్పదంగా కనిపించకుండా పోయింది. కూతురు పూజా రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి కుశాల్ తో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె కోసం వెతికారు. బంధువులు ఇళ్లలో, స్నేహితుల ఇళ్లలో వెతికినా పూజా ఆచూకి తెలీలేదు. పూజ స్నేహితులు అందరికి ఫోన్లు చేసి ఆమె గురించి అడిగినా ఎలాంటి ఫలితం లేదు.

పూజా అదృశ్యంపై అగుంబే పోలీస్ స్టేషన్లో ఆమె తండ్రి కుశాల్ ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదైంది. అగుంబే పోలీస్స్టేషన్ ఎస్ఐ రంగనాథ్ అంతరగట్టి ఆధ్వర్యంలో పోలీసులు బృందంగా ఏర్పడి ఆపరేషన్ చేపట్టారు. పూజా కోసం పలు ప్రాంతాల్లో గాలించినా పోలీసులకు ఎలాంటి క్లూ చిక్కలేదు. పూజా మొబైల్ ఫోన్ నెంబర్ లోని ఇన్ కమింగ్ కాల్స్, ఔట్ గోయింగ్ కాల్స్ వివరాలను పోలీసులు సేకరించారు.
ఇదే సమయంలో అటవి ప్రాంతంలోని ఓ నీటి గుంత సమీపంలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. శవమై కనిపించిన యువతిని పూజా గుర్తించిన పోలీసులు పలు కోణాల్లో విచారణ చేశారు. పూజాకు తెలిసిన మణి అనే వ్యక్తి ఆమెను చితకబాది చంపేసి నాలూరు సమీపంలోని గోతిలో పడేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తరువాత పోలీసులు మణిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు బెండ్ తియ్యడంతో నిందితుడు మణి పోలీసుల ముందు తానే పూజాను హత్య చేశానని అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు శవపరీక్ష నిర్వహించి పూజా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి తరువాత వైద్య పరీక్షలు నిర్వహించి శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడు మణిని అరెస్టు చేశారు. విచారణ కొనసాగుతోంది.
పూజా హత్యకు గురైన ప్రదేశాన్ని మాజీ హోం మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఆరగ జ్ఞానేంద్ర సందర్శించి వివరాలు సేకరించారు. బీజేపీ ఎమ్మెల్యే ఆరగ జ్ఞానేంద్ర సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసు అధికారులతో మాట్లాడి పూజా హత్య గురించి సమాచారం తెలుసుకున్నారు. అయితే పూజాను ఎందుకు హత్య చేశాను అని మణి బయటకు చెప్పడం లేదని, కేసు విచారణలో ఉందని శివమొగ్గ జిల్లా పోలీసులు తెలిపారు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications