Jalandhar : ఉపఎన్నికల్లో ఆప్ విజయం-కాంగ్రెస్ 24 ఏళ్ల రికార్డు బద్దలు..
పంజాబ్ లోని జలంధర్ లోక్ సభ సీటుకు జరిగిన ఉపఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన జలంధర్ సీటును ఆప్ తొలిసారి గెల్చుకుంది. గత 24 ఏళ్లుగా జలంధర్ సీటును గెల్చుకుంటూ పట్టు కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి దీంతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆప్ కు ఇది మరో విజయం.
జలంధర్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ 24 ఏళ్లుగా పట్టు కొనసాగిస్తోంది. దీన్ని ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ బద్దలు కొట్టింది. జలంధర్ ఎంపీ సీటుకు జరిగిన ఉపఎన్నికలో ఆప్ .. 58,000 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించింది. చతుర్ముఖ పోటీలో గతంలో కాంగ్రెస్ లో ఉండి ఆప్ కు మారిన అభ్యర్ధి రింకూ.. ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్ది.. కాంగ్రెస్ అభ్యర్ధి కరమ్ జిత్ కౌర్ ను ఓడించారు.

వాస్తవానికి జలంధర్ లో కాంగ్రెస్ ఎంపీగా ఉన్న సంతోఖ్ చౌదరి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొంటూ ఆకస్మికంగా మరణించారు. దీంతో జలంధర్ సీటుకు ఉపఎన్నిక వచ్చింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఆయన భార్య కరమ్ జీత్ కౌర్ ను నిలబెట్టింది. అయినా ఆప్ అభ్యర్ధి చతుర్ముఖ పోటీలో సానుభూతి పవనాల్ని సైతం తట్టుకుని విజయం సాధించారు. పంజాబ్లో భగవంత్ మాన్ ప్రభుత్వం పనితీరు వల్లనే అపూర్వ విజయం సాధించామని పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
తాము పని రాజకీయాలు చేస్తామని, తమ పనిని గుర్తించి ఓట్లు అడుగుతామని సీఎం భగవంత్ మాన్ తెలిపారు. ఈ ఫలితం ఓ పెద్ద సందేశం అని భగవంత్ మాన్ తెలిపారు. ఎన్నికల ఫలితాలు బాధ్యతను, ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని, పంజాబ్ను అభివృద్ధి చేసేందుకు మరింత కష్టపడతామని ఆయన అన్నారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ఓటమిని అంగీకరించారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ, దాని అభ్యర్థి సుశీల్ రింకును అభినందించారు.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications