అనూహ్య కేసు: గర్ల్ఫ్రెండ్ ఇంట్లో తాగాడు, వెళ్లమని తల్లి
ముంబై: ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళా టెక్కీ అనూహ్య హత్యకు ముందు నిందితుడు తాగి ఉన్నట్లుగా అతని స్నేహితులు పోలీసులకు చెప్పారు. అనూహ్య హత్య కేసులో చంద్రభాన్ సనప్ను అరెస్టు చేసిన పోలీసులు, ఛార్జీషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అనూహ్య హత్యకు ముందు రోజు రాత్రి తాము తాగామని అతని స్నేహితులు పోలీసులకు చెప్పారు.
నిందితుడు చంద్రభాన్కు చెందిన గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ముందు రోజు రాత్రి తాము మద్యం తాగినట్లు ఓ స్నేహితుడు చెప్పాడు. ఇదే విషయాన్ని గర్ల్ ఫ్రెండ్ కూడా చెప్పారని తెలుస్తోంది. వారు మద్యం తాగిన ప్రాంతం అనూహ్య మృతదేహం దొరికిన ప్రాంతానికి దాదాపు అర కిలోమీటర్ దూరంలో ఉంది.
అనూహ్య హత్య కేసులో పోలీసులు 78 మంది సాక్ష్యులను విచారించారు. అందులో సనప్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉన్నారు. వారు ఆ రోజు అర్ధరాత్రి వరకు మద్యం తాగారట. ఆ తర్వాత తన ద్విచక్ర వాహనం పైన అక్కడి నుండి వెళ్లిపోయాడని చెప్పారు. మద్యం తాగినట్లు సనప్ గర్ల్ ఫ్రెండ్, మరో ఫ్రెండ్ చెప్పారు.

వీరి వాంగ్మూలం కేసులో కీలకమని పోలీసులు బావిస్తున్నారు. కాగా, జనవరి 5వ తేదీన రక్తం మరకలతో సనప్ ఇంటికి వచ్చాడట. సనప్ కుటుంబ సభ్యుల సాక్ష్యం మేరకు... అతను రక్తపు మరకలతో వచ్చాడు. ఏం జరిగిందని అడిగితే.. రాబరీకి పాల్పడపోయి యువతిని చంపినట్లుగా అతను చెప్పాడట. దీంతో కుటుంబ సభ్యులు అతని పైన ఆగ్రహం వ్యక్తం చేశారట. నగరం విడిచి వెళ్లిపోమని చెప్పారట.
కాగా, అనూహ్య కేసులో పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేసినట్లు జాయింట్ కమిషనర్ సదానంద్ ధాతే సోమవారం తెలిపారు. ఈ కేసులో 546 పేజీల చార్జీషీటును దాఖలు చేసినట్లు చెప్పారు. 78 మందిని విచారించారు. నిందితుడు ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నాడు.
కేసు దర్యాఫ్తుకు అవసరమైన ఎన్నో ఆధారాలను పోలీసులు సేకరించారు. అనూహ్య నుండి దొంగిలించిన బ్యాంగ్, దుస్తులు, ఐడి కార్డుతదితర వస్తువుల్లో లభించిన డిఎన్ఏను గుర్తించేందుకు ప్రయత్నించారు. నిందితుడి డిఎన్ఏతో సరిపోలింది. మరోవైపు ల్యాప్ టాప్ ఆచూకీ లభించలేదు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications