బీజేపీ ఎంపీ మీద పరువునష్టం దావా వేసిన నటుడు ప్రకాష్ రాజ్, రూ. ఎంతకో తెలుసా ?
మైసూరు/బెంగళూరు: కర్ణాటకలోని మైసూరు-కొడుగు పార్లమెంట్ నియోజక వర్గం బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మీద ప్రముఖ బహుబాష నటుడు, దర్శక నిర్మాత ప్రకాష్ రాజ్ మంగళవారం పరువు నష్టం దావా వేశారు. తన పరువు తీసే విధంగా సోషల్ మీడియాలో బీజేపీ ఎంపీ తనను విమర్శించారని, లేనిపోని ఆరోపణలు చేశరాని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని ప్రకాష్ రాజ్ మంగళవారం మైసూరు కోర్టును ఆశ్రయించారు.

సోషల్ మీడియాలో వైరల్
బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా, నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో మాటల యుద్ధం కొనసాగించారు. ఆ సందర్బంలో వీరి ఆరోపణలు, ప్రత్యారోపణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు ప్రకాష్ రాజ్ ను విమర్శిస్తే మరి కొందరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాను విమర్శించారు.

ప్రధాని మోడీకి ప్రశ్నలు
నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీకి సోషల్ మీడియాలో పలు ప్రశ్నలు చేశారు. ప్రకాష్ రాజ్ మోడీని ప్రశ్నించడంతో బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ఎంటర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ప్రకాష్ రాజ్ ను తీవ్రస్థాయిలో విమర్శించారు.

కొడుకు చస్తే డ్యాన్సర్ తో ఎంజాయ్
కొడుకు చనిపోయాడని ఏమాత్రం బాధలేకుండా ప్రకాష్ రాజ్ ఓ డ్యాన్సర్ తో పారిపోయి చిందులు వేశాడని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ఆరోపించారు. ఇలాంటి మానవత్వం లేని వ్యక్తి దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఎలా ప్రశ్నిస్తారని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా సోషల్ మీడియాలో మండిపడ్డారు.

నిజ జీవితంలో విలన్
సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా ప్రకాష్ రాజ్ విలన్ అని బీజేపీ ఎంపీ సోషల్ మీడియాలో ఆరోపించారు. ఫేస్ బుక్, ట్వీట్టర్ వేదికగా తనను అవమానించి, తన పరువుకు భంగంకలిగేలా ప్రవర్తించిన బీజేపీ ఎంపీ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించిన ప్రకాష్ రాజ్ ఆయనకు లీగల్ నోటీసులు పంపించారు.

పరువు నష్టం ఎంతకంటే ?
బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా తనను వ్యక్తిగతంగా విమర్శించి తన పరువుకు భంగం కలిగేలా చేశారని, న్యాయం చెయ్యాలని ప్రకాష్ రాజ్ మైసూరు కోర్టును ఆశ్రయించారు. తన పరువుపోవడానికి కారణం అయిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా నుంచి రూ. 1 పరిహారం ఇప్పించాలని ప్రకాష్ రాజ్ కోర్టులో మనవి చేశారు.

ఒక్క రూపాయితో పరువు
తాను డబ్బుకోసం పరువు నష్టం దావా వెయ్యలేదని, ఉన్నతమైన ఎంపీ స్థానంలో ఉన్న ప్రతాప్ సింహా ఆయన స్థాయి మరిచిపోయి దిగజారుడు రాజకీయాలు చేశారని, అందుకే తగిన బుద్ది చెప్పడానికి పరువు నష్టం దావా వేశానని ప్రకాష్ రాజ్ చెప్పారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications