ఎన్నికలకు ముందు...: బీజేపీలో చేరిన ఎస్ఎం కృష్ణ
కేంద్రమాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ భారతీయ జనతా పార్టీలో చేరారు. కర్ణాటకకు చెందిన ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరుతారని గతకొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఈ రోజు (బుధవారం) తెరదించారు.
న్యూఢిల్లీ: కేంద్రమాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ భారతీయ జనతా పార్టీలో చేరారు. కర్ణాటకకు చెందిన ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరుతారని గతకొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఈ రోజు (బుధవారం) తెరదించారు.
ఆయన ఈ రోజు సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా నేతృత్వంలో ఆ పార్టీలో చేరారు. ఎస్ఎం కృష్ణ గతంలో కర్నాటక ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పని చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎం కృష్ణ మాట్లాడారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇప్పుడు కొత్త జర్నీ ప్రారంభం అవుతోందని, బీజేపీలో చేరడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు.

కర్నాటకలోను, జాతీయ రాజకీయాల్లోను తాను గతంలో పలు కీలక పదవులు చేపట్టానని చెప్పారు. వాజపేయి వంటి పలువురు బీజేపీ నేతలతో తనకు అనుబంధం ఉందని చెప్పారు.
ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరడంతో కర్నాటకలో తమ పార్టీ మరింత బలపడుతుందని అమిత్ షా అన్నారు. కర్నాటకలో 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్. ఆయన వొక్కలింగ వర్గానికి చెందిన వారు. ఈయన చేరికతో ఆ ఓట్లపై బీజేపీ ఆశ పెట్టుకుంది.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications