అన్నాడీఎంకే 365 డేస్: సీఎంకు రెండు వర్గాలు వార్నింగ్, రాజీనామా చెయ్యాలి, పార్టీలో !
తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చి నేటితో ఒక్క సంవత్సరం పూర్తి అయ్యింది. అయితే అదే రోజు రెండు వర్గాల నాయకులు తమ వర్గంలోని ఎమ్మెల్యేలను వెంట పిలుచుకుని ఏకంగా సచివాలయం చేరుకుని మాడి మాండ్లు
చెన్నై: తమిళనాడులో వరుసగా రెండో సారి అధికారం చేపట్టిన అన్నాడీఎంకే పార్టీ నేటితో (మే 23)తో ఒక్క సంవత్సరం అధికారం పూర్తి చేసుకుంది. ఒక్క సంవత్సరం అధికారం పూర్తి చేసుకున్న సందర్బంగా అన్నాడీఎంకే కార్యకర్తలు ఎక్కడా సంబరాలు చేసుకోలేదు.
కనీసం మిఠాయిలు పంచిపెట్టలేదు. జయలలిత మరణం, తరువాత పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి కావడం, శశికళ ఆదేశాలతో ఆయన రాజీనామా చెయ్యడం, చిన్నమ్మ, టీటీవీ దినకరన్ జైలుకు వెళ్లడం, ఎడప్పాడి పళనిసామి ముఖ్యమంత్రి కావడం ఇదే సంవత్సంలో జరిగిపోయాయి.

సీఎంకు సినిమా చూపించారు
అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చి ఒక్క సంవత్సరం పూర్తి అయిన సందర్బంలో ఆ పార్టీకి చెందిన 15 మంది సీనియర్ ఎమ్మెల్యేలు సచివాలయం చేరుకుని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి సినిమా చూపించారు. ప్రభుత్వం, పార్టీలో మార్పులు చెయ్యాలని మంగళవారం డిమాండ్ చేశారు. మీరు మా డిమాండ్లు తీర్చకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామని హెచ్చరించారని సమాచారం.

మంత్రి వర్గంలో అవకాశం ఇవ్వాలి !
మాజీ మంత్రులు తోపు వెంకటాచలం, సెంథిల్ బాలాజీ, పి పళనియప్పన్ తో సహ వారి వర్గంలోని పలువురు ఎమ్మెల్యేలు మరో గ్రూపుగా సీఎం పళనిసామిని కలిశారు. మేం ముగ్గురు జయలలిత మంత్రి వర్గంలో పని చేశామని, ఇప్పుడు మళ్లీ మాకు మంత్రి పదవులు కావాలని, లేదంటే వేరే దారి చూసుకుంటామని పళనిసామికి పరోక్షంగా హెచ్చరించారని వెలుగు చూసింది.

రెండు గ్రూపులు వార్నింగ్ ఇస్తే !
రెండు వర్గాలుగా వచ్చి వారి డిమాండ్లు చెప్పడంతో ఎడప్పాడి పళనిసామి హడలిపోయారని తెలిసింది. అందరూ ఏకం అయ్యి తన సీఎం పదవికి ఎసరు పెడుతున్నారని గ్రహించిన పళనిసామి కొద్ది రోజులు వేచి ఉండాలని బుజ్జగించడానికి ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయిందని సమాచారం.

సన్నిహితులతో సీఎం సమావేశం !
రెండు వర్గాలు వచ్చి వారి డిమాండ్లు చెప్పి వెళ్లిన వెంటనే పళనిసామి తనకు అందుబాటులో ఉన్న మంత్రులను పిలిపించుకుని చర్చించారని తెలిసింది. ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలంటే వారి డిమాండ్లు తీర్చాలని అంటున్నారని ఇప్పుడు ఏమి చెద్దాం అంటూ పళనిసామి వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారని తెలిసింది.

త్యాగం చెయ్యండి
గ్రూపులుగా విడిపోయిన నాయకులకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలంటే ప్రస్తుతం మంత్రి వర్గంలో ఉన్న వారు రాజీనామా చెయ్యాలని పళనిసామి సహచర మంత్రులతో చెప్పారని తెలిసింది. కొత్త వారికి అవకాశం కల్పించాలంలే మీలో ఎవరు త్యాగం చేస్తారు ? అని ఆరా తీశారని సమాచారం.

పేరుకు మాత్రం సీఎం, ముఖంలో !
పేరుకు మాత్రం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎడప్పాడి పళనిసామి ముఖంలో కనీసం నవ్వు కూడా కనిపించలేదు. మంత్రులతో సహ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సైతం ఎక్కడా సంబరాలు చేసుకోలేదు. మన పార్టీ అధికారంలోకి వచ్చి ఒక్క సంవత్సరం అయ్యిందా అంటూ ఆ పార్టీ కార్యకర్తలు ఆశ్చర్యంగా మాట్లాడటం వింటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది.

జయలలితను మరిచిపోయారు ?
తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం అయిన జయలలిత మరణించారు. అధికారంలోకి వచ్చి ఒక్క సంవత్సరం పూర్తి అయిన సందర్బంగా కనీసం ఎక్కడకాని అమ్మ చిత్రపఠానికి నివాళులు అర్పించలేదు. ఎడప్పాడి పళనిసామికి ఆయన అత్యంత సన్నిహితులు మాత్రం శుభాకాంక్షలు చెప్పారని తెలిసింది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications