వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆమె కో-పైలట్‌గా వస్తేనే: ఫ్లైట్‌ను 2గం.ఆపేసిన పైలట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మహిళా కో పైలట్ కావాలని ఎయిర్ ఇండియాకు చెందిన ఓ పైలట్ పట్టుబట్టడంతో విమానం రెండు గంటలపాటు ఆలస్యమైంది. 110 మంది ప్రయాణీకులతో ఉన్న విమానాన్ని.. మహిళా కో పైలట్ కోసం పైలట్ రెండు గంటలపాటు ఆపివేయడం గమనార్హం.

వివరాల్లోకి వెళ్తే.. తనకు నచ్చిన మహిళా పైలట్‌ను కో-పైలట్‌గా ఇవ్వలేదన్న కారణంతో మాలే నుంచి తిరువనంతపురం మీదుగా చెన్నై వెళ్లాల్సిన విమానాన్ని రెండు గంటలు ఆలస్యం చేశాడు సదరు పైలట్. మొత్తం 110 మంది పాసింజర్లు విమానం ఎక్కిన తర్వాత ఈ ఘటన జరిగింది.

Air India pilot insists for particular woman co pilot, delays flight by 2 hours

సదరు మహిళా పైలట్‌ను కేటాయించేందుకు అధికారులకు సమయం ఇస్తూ.. తనకు బీపీ పెరిగిందని ఫిర్యాదు చేశాడు. చికిత్స పేరిట కాసేపు నాటకమాడాడు. తనకు ఆ మహిళా పైలట్‌నే ఇవ్వాలని రోస్టర్ సెక్షన్‌కు ముందే సమాచారం ఇచ్చాడట అతను.

అది కుదరదని, మహిళా పైలట్‌ను మరో విమానానికి కేటాయించామని చెబితే.. ససేమిరా అంటూ విమానాన్ని కదిలించేందుకు భీష్మించాడని తెలుస్తోంది. ఈ ఘటనతో ఉదయం ఏడు గంటలకు బయలుదేరాల్సిన విమానం తొమ్మిది గంటల తర్వాత బయలుదేరింది. దీనిపై అధికారులు స్పందించవలసి ఉంది.

English summary
As many as 110 passengers onboard an Air India aircraft were forced to sit in the plane for two and half hours on Wednesday after its commander insisted for a "particular" woman co-pilot to operate the flight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X