ఆమె కో-పైలట్గా వస్తేనే: ఫ్లైట్ను 2గం.ఆపేసిన పైలట్
న్యూఢిల్లీ: మహిళా కో పైలట్ కావాలని ఎయిర్ ఇండియాకు చెందిన ఓ పైలట్ పట్టుబట్టడంతో విమానం రెండు గంటలపాటు ఆలస్యమైంది. 110 మంది ప్రయాణీకులతో ఉన్న విమానాన్ని.. మహిళా కో పైలట్ కోసం పైలట్ రెండు గంటలపాటు ఆపివేయడం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే.. తనకు నచ్చిన మహిళా పైలట్ను కో-పైలట్గా ఇవ్వలేదన్న కారణంతో మాలే నుంచి తిరువనంతపురం మీదుగా చెన్నై వెళ్లాల్సిన విమానాన్ని రెండు గంటలు ఆలస్యం చేశాడు సదరు పైలట్. మొత్తం 110 మంది పాసింజర్లు విమానం ఎక్కిన తర్వాత ఈ ఘటన జరిగింది.

సదరు మహిళా పైలట్ను కేటాయించేందుకు అధికారులకు సమయం ఇస్తూ.. తనకు బీపీ పెరిగిందని ఫిర్యాదు చేశాడు. చికిత్స పేరిట కాసేపు నాటకమాడాడు. తనకు ఆ మహిళా పైలట్నే ఇవ్వాలని రోస్టర్ సెక్షన్కు ముందే సమాచారం ఇచ్చాడట అతను.
అది కుదరదని, మహిళా పైలట్ను మరో విమానానికి కేటాయించామని చెబితే.. ససేమిరా అంటూ విమానాన్ని కదిలించేందుకు భీష్మించాడని తెలుస్తోంది. ఈ ఘటనతో ఉదయం ఏడు గంటలకు బయలుదేరాల్సిన విమానం తొమ్మిది గంటల తర్వాత బయలుదేరింది. దీనిపై అధికారులు స్పందించవలసి ఉంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications