ఎయిర్ ఇండియా: ‘విమానంలో సిగరెట్ తాగినందుకు రూ. 250 జరిమానా కడతా’ - జడ్జితో ప్రయాణికుడి వాగ్వాదం.. ఆ తర్వాత ఏం జరిగింది?

విమానంలో సిగరెట్ తాగడంతో పాటు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారన్న కేసులో.. నిందితుడు రత్నాకర్ ద్వివేది జెయిలుకు వెళ్లారు.
ఈ కేసులో ముంబై పోలీసులు ఆయనను అరెస్ట్ చేయగా.. రూ. 25,000 పూచీకత్తుతో బెయిలు పొందేందుకు జడ్జి అవకాశం ఇచ్చారు.
కానీ, ఐపీసీ ప్రకారం తనకు రూ. 250 జరిమానా విధిస్తే సరిపోతుందని.. తాను ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఈ విషయం తెలుసుకున్నానని నిందితుడు వాదించారు.
బెయిల్ కోసం 25,000 రూపాయల పూచీకత్తు చెల్లించేందుకు నిరాకరించారు.
- విమానంలో మహిళపై మూత్రం పోసిన కేసు.. ఎవరేమంటున్నారు
- విమానంలో వృద్ధురాలిపై మూత్రం పోసిన వ్యక్తి తండ్రి ఏమంటున్నాడంటే..

మార్చ్ 10న లండన్ నుంచి ముంబయి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో రత్నాకర్ ద్వివేది ప్రయాణించారు. అయితే, ఆయన ప్రయాణ సమయంలో టాయిలెట్లోకి వెళ్లి సిగరెట్ తాగినట్లు సిబ్బంది ఆరోపించారు.
సిగరెట్ తాగుతుండగా విమాన సిబ్బంది పట్టుకున్న తరువాత వారితో ఆయన దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపించారు.
ఈ ఘటనలో రత్నాకర్పై ఐపీసీ సెక్షన్ 336 ప్రకారం కేసు పెట్టారు. ఇతరుల వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించడం, ప్రాణాలకు ప్రమాదం కలిగించడం అనే నేరారోపణలతో ఆయనపై కేసు పెట్టారు.
ఈ కేసు నమోదు చేసిన ముంబయి పోలీసులు.. రత్నాకర్ ద్వివేది విమానంలో గొడవ చేశారని, ఇతర ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తెచ్చే తరహాలో ప్రవర్తించారని.. గొడవ చేయొద్దని పైలట్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని.. రాతపూర్వకంగా పైలట్ కోరినా ఆయన లెక్కచేయలేదని ఎఫ్ఐఆర్లో రాశారు.
- 10 నిమిషాలు లేటుగా వచ్చిందని విమానాన్ని 16 గంటలు చక్కర్లు కొట్టించారు...ఏం జరిగిందంటే...
- ఎయిరిండియా: రికార్డు సంఖ్యలో విమానాల కొనుగోలుతో అంతర్జాతీయ సంస్థలకు సవాల్ విసరబోతోందా?

నిందితుడిని అరెస్ట్ చేసి సోమవారం నాడు ముంబై లోని అంధేరి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
నిందితుడు రత్నాకర్ ద్వివేదిని రూ. 25,000 పూచీకత్తు మీద విడుదల చేసేందుకు మెజిస్ట్రేట్ అవకాశం ఇచ్చారు.
అయితే.. ఐపీసీ 336 కేసులో జరిమానా రూ. 250 ఉంటుందని, ఆ మొత్తమైతే తాను చెల్లించడానికి సిద్ధమని నిందితుడు చెప్పారు.
ఈ విషయాన్ని ఆన్లైన్లో సెర్చ్ చేసి తెలుసుకున్నానని కూడా పేర్కొన్నారు.
అంతేకానీ బెయిల్ కోసం పూచీకత్తుగా రూ. 25,000 కట్టడానికి తాను అంగీకరించనన్నారని పీటీఐ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది.
దీంతో నిందితుడిని జైలుకు పంపిస్తూ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఆస్కార్ 2023: ''నాటునాటు పాటను తరాల పాటు గుర్తుంచుకుంటారు...’’ ఆర్ఆర్ఆర్ బృందానికి అభినందనల వెల్లువ
- లావణి డ్యాన్స్: మహిళలను ప్రైవేటుగా బుక్ చేసుకునే ఈ నృత్యం ఏంటి? ఈ జీవితం మీద ఆ మహిళలు ఏమంటున్నారు?
- స్టాక్ మార్కెట్ ద్వారా తక్కువ కాలంలో ధనవంతులు కావొచ్చా? ఇందులో నిజమెంత?
- చైనా: జాక్ మా, బావో ఫ్యాన్, మరికొందరు.. బిలియనీర్ల వరుస అదృశ్యాల వెనుక మిస్టరీ ఏంటి?
- 2023 DW: భూమి వైపు దూసుకొస్తున్న గ్రహ శకలం.. 2046 'వాలెంటైన్స్ డే నాడు భూమిని తాకవచ్చు'
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications