ఆ బొగ్గు బ్లాక్స్ కేటాయింపులన్నీ అక్రమమే: సుప్రీం
న్యూఢిల్లీ: 1993 తర్వాత స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన బొగ్గు బ్లాక్స్ కేటాయింపులన్నీ అక్రమమేనని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఆ కేటాయింపులు పారదర్శకంగా, న్యాయంగా జరగలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బొగ్గు బ్లాక్స్ కేటాయింపులో అనుసరించిన నియమాలను తప్పు పట్టిది.
బొగ్గు కేటాయింపులన్నీ స్క్రీనింగ్ కమిటీ నిబంధనల మేరకు జరిగాయని, ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులు అక్రమమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు బ్లాక్ కేటాయింపుల్లో మార్దదర్శక సూత్రాలను ఉల్లంఘించారని చెప్పింది.
మొత్తం 218 బొగ్గు బ్లాక్ కేటాయింపులను రద్దు చేయాలా, వద్దా అనే విషయాన్ని నిర్ధారించడానికి మరింత విచారణ అవసరమని అంటూ బొగ్గు బ్లాక్ కేటాయింపుల అక్రమాలపై పరిణామాలను నిర్ణయించడానికి సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1వ తేదీన గడువుగా పెట్టింది.
జార్ఖండ్, చత్తీస్గడ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లోని బొగ్గు గనులను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టారు.