ఇరోమ్ పదహారేళ్ల సుదీర్ఘ దీక్షకు రేపటితో ముగింపు
ఇంఫాల్ : పదహారేళ్ల సుదీర్ఘ దీక్షకు స్వస్తి పలుకుతూ మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓ సంచలనం. మంగళవారం నాటితో ఇరోమ్ షర్మిల దీక్షకు తెరపడుతుండగా.. డిమాండ్లను నెరవేర్చుకోవడానికి రాజకీయ పంథాను అనుసరిస్తానని ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే.
మంగళవారం నాడు ఇరోమ్ షర్మిల దీక్ష విరమణ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. కాగా, మణిపూర్ లో అమలు జరుగుతోన్న సాయుధ బలగాల చట్టాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్ తో 2000 సంవత్సరం నుంచి దీక్ష చేస్తూ వస్తున్నారు ఇరోమ్ షర్మిల. దీక్ష ప్రారంభించిన నాటి నుంచి ఆసుపత్రి దిగ్బంధనంలోనే పోలీసుల పహారాలో ఆమె దీక్ష సాగుతూ వస్తోంది. కేవలం ద్రవ పదార్థాలను మాత్రమే నాజల్ ట్యూబ్ ద్వారా ఆమె ఆహారంగా తీసుకుంటూ వస్తున్నారు.

ఇదిలా ఉంటే.. దీక్ష విరమించే క్రమంలో మంగళవారం నాడు ఉదయం తొలుత ఆమె జ్యుడిషీయల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. మెజిస్ట్రేట్ లో ఆమె దీక్ష విరమణ ప్రకటన చేయగానే జ్యుడీషియల్ కస్టడీ ముగిసినట్లుగా ప్రకటిస్తుంది కోర్టు. అటు తర్వాత తన మద్దతుదారులతో సమావేశం కానున్న ఇరోమ్ షర్మిల.. తన భవిష్యత్తు ప్రణాలిక గురించి చర్చించనున్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications