Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Jharkhand: గడచిన 10 ఏళ్లలో జార్ఖండ్ ఎకానమీ ఎలా అభివృద్ధి చెందింది? ప్రజల జీవితాల్లో ఏం మారింది?

Jharkhand Economy: సహజ వనరులకు ప్రసిద్ధి చెందిన జార్ఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు దగ్గరపడ్డాయి. అయితే గడచిన దశాబ్ధకాలంలో ఈ రాష్ట్రంలో గణనీయమైన ఆర్థిక అభివృద్ధి కనిపించింది. వృద్ధితో పాటు, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రం.. పెరుగుతున్న బాధ్యతలు-ఆర్థిక లోటుతో సహా పెరుగుతున్న ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంది. 2014-19 మధ్య బీజేపీ సర్కార్ అధికారంలో ఉండగా 2019-24 మధ్య కాలంలో జెఎమ్‌ఎమ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాల హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎలా అభివృద్ధి చెందిందనేది అందరి దృష్టిని ప్రస్తుతం ఆకర్షిస్తోంది.

జార్ఖండ్, RBI తాజా ఆర్థిక సర్వే డేటా ప్రకారం 2014-2024 మధ్య కాలంలో జార్ఖండ్ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని సాధించిందని వెల్లడైంది. పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ఇది నడపబడింది. 2014 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల జీడీపీ బీజేపీ హయాంలో రూ.1.65 లక్షల కోట్లుగా ఉండగా అది 2019 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.2.29 లక్షల కోట్లకు పెరిగింది. ఐదేళ్ల కాలంలో 38% పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. అలాగే FY24 ప్రభుత్వ డేటా ప్రకారం JMM కాంగ్రెస్ నేతృత్వంలోని హయాంలో జీఎస్టీ ఆదాయం రూ.2.78 లక్షల కోట్లకు పెరిగి దాదాపు 21% వృద్ధిని సాధించింది. ఎన్డీఏ ప్రభుత్వ హయాం చివరి నాటికి తలసరి ఆదాయం రూ.75,421గా ఉండగా అది యూపీఐ హయాంలో చివరికి రూ.98,649కి పెరిగింది.

Amid Elections nearing in Jharkhand know how its economy developed in UPA NDA Governments

జార్ఖండ్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నప్పుడు, రెండు కాలాల్లోనూ ప్రభుత్వ రుణంతో సహా దాని మొత్తం బకాయి బాధ్యతలు గణనీయంగా పెరిగాయి. ఆర్థిక స్థిరత్వం గురించి కూడా ఆందోళనలు పెరిగాయి. FY14లో బీజేపీ పాలనలో రాష్ట్ర మొత్తం అప్పులు రూ.37,840 కోట్లుగా ఉండగా.., FY19 నాటికి ఈ అప్పుల బాధ్యతలు రూ.83,783 కోట్లకు పెరిగాయి. పారిశ్రామిక వృద్ధిని పెంపొందించే లక్ష్యంతో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం రుణాలు తీసుకోవడం భారం పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది. ఇక UPA ప్రభుత్వం అభివృద్ధి కోసం రుణాలు తీసుకోవడం కొనసాగించింది. ఈ క్రమంలో FY23 నాటికి బాకీలు రూ.1.18 లక్షల కోట్లకు పెరిగిపోయాయి.

బీజేపీ ఆధ్వర్యంలో FY14లో రాష్ట్ర వార్షికంగా క్యాపెక్స్ వ్యయం రూ.6,632 కోట్లుగా ఉండగా అది FY19 నాటికి 128% పెరిగి రూ.15,132 కోట్లకు చేరింది. దీంతో పాలన మెుత్తం సమయంలో క్యాపెక్స్ ఖర్చు రూ.72,208 కోట్లుగా నిలిచింది. UPA హయాంలో మొత్తం క్యాపెక్స్ రూ.69,538 కోట్లుగా అంచనా వేయబడింది. ఇక్కడ పూర్తి స్థాయి డేటా అందుబాటులో లేదు. ఇక ఆర్థిక లోటు గురించి చూస్తే.. FY14లో ద్రవ్య లోటు రూ.2,222 కోట్ల నుంచి FY19 నాటికి రూ.6,252 కోట్లకు పెరిగింది. ఇక కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ హయాంలో ద్రవ్య లోటు పెరుగుతూనే ఉంది. FY23లో రూ.11,287 కోట్లకు చేరుకుంది.

2014-2024 మధ్య బీజేపీ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. అయితే యూపీఏ ప్రభుత్వం సామాజిక సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధిని సమతుల్యం చేసింది. రెండు ప్రభుత్వాలు రాష్ట్ర వృద్ధికి దోహదపడ్డాయని తెలింది. అయితే ఇకపై ముందుకు కొనసాగటానికి జార్ఖండ్ రాష్ట్రం తన రుణ స్థాయిలను నిర్వహించడంపై అధికంగా దృష్టి పెట్టాల్సి ఉంటుందేనని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇదే క్రమంలో జార్ఖండ్ తన ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవటానికి ఆదాయ ఉత్పత్తిని మెరుగుపరచాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+