వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజనపై అమీషా పటేల్ ట్వీట్: కిరణ్‌ రెడ్డికి కితాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Amisha Patel
హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ దృష్టి పడింది. రాష్ట్ర విభజనపై ఆమె ఎక్కడ లేని ఆసక్తి కనబరిచింది. రాష్ట్ర విభజనపై ఆమె ట్విట్టర్‌లో తన వ్యాఖ్యలను పోస్టు చేసింది.

రాష్ట్రాన్ని చీల్చేందుకు జరుగుతున్న కుట్ర, కుతంత్రాల్ని అడ్డుకోవడంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారని, ఆయనను తప్పక అభినందించాల్సిందేనని ఆమె ట్విట్టర్లో వ్యాఖ్యానించింది. భారతీయులు ఎప్పుడూ సమైక్యంగానే ఉండాలని, విభజించు పాలించు అన్న బ్రిటిష్ వాదంతో మనవాళ్ళు నష్టపోరాదని తెలిపింది.

అమీషా పటేల్ వ్యాఖ్యలపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. తెలంగాణ గురించి తెలియకుండా మాట్లాడడం మంచిది కాదని వారంటున్నారు. వారి వ్యాఖ్యలపై కూడా అమీషా ప్రతిస్పందించింది. ఏది మంచో ఏది చెడో ప్రజలే అర్థం చేసుకుంటారని ట్వీట్ చేసింది.

గతంలో తెలుగు సినీ నటులు రాష్ట్ర విభజన వ్యవహారంలో కాలు పెట్టి చేతులు కాల్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను వ్యతిరేకించిన సినీ నటుల సినిమాలను బహిష్కరించారు. వారి సినిమా షూటింగులను అడ్డుకున్నారు.

English summary
Bollywood actress Ameesha Patel tweeted "So proud of CM kiran Reddy 2 stand firm for a united Andhra...divide n rule was a british tactic..indians shud never divide themselves".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X