ప్రధాని మోడీ రాసిన అద్భుతమైన కవిత .. ఇది చదివితే నైరాశ్యం నుండి వెలుగువైపు పయనించటం ఖాయం
2020 సంవత్సరం ముగిసింది. 2020 వ సంవత్సరం ప్రపంచానికి చేదు జ్ఞాపకం కాగా, భారతదేశం సైతం 2020 సంవత్సరం సృష్టించిన విలయాన్ని ధైర్యంగా ఎదుర్కొంది. 2021 నూతన సంవత్సర ఆగమనం గత ఏడాది తాలూకు చేదు జ్ఞాపకాలను తుడిచిపెట్టి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలా ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ కొత్త సంవత్సరంలోనైనా మంచి రోజులు రావాలని యావత్ ప్రపంచం నూతన సంవత్సరానికి స్వాగతం పలికింది.

చాలా స్ఫూర్తిదాయకమైన కవితను రాసిన నరేంద్ర మోడీ
నూతన సంవత్సరం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా స్ఫూర్తిదాయకమైన కవితను రాశారు. తనగళంతో వినిపించారు . ప్రధాని నరేంద్ర మోడీ రాసిన కవితలో సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడు అంటూ మన జీవితాల్లో చీకట్లు తొలగి విజయమనే సూర్యుడు ప్రకాశిస్తాడు అని చాలా చక్కని భావ వ్యక్తీకరణ ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ రాసిన కవిత ఆశావహ దృక్పథంతోముందుకు సాగమని చెప్తుంది . అంతేకాదు ఆ కవిత ఆయన గాత్రం తో వినిపించడం ప్రతి ఒక్కరిలో ప్రేరణ కలిగిస్తోంది .

అభితో సూరజ్ ఉగా హై అంటూ ఆయన గాత్రంతో వినిపించిన కవిత
ప్రధాని నరేంద్ర మోడీ చాలా గొప్పగా రాసిన కవిత నైరాశ్యం లో ఉన్న ఎంతో మందిని చైతన్యం వైపు నడిపిస్తుంది. వారిలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది.
అభితో సూరజ్ ఉగా హై.. సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడు అనే టైటిల్ తో ప్రధాని మోడీ రాసిన కవితను కేంద్ర ప్రభుత్వం తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ నూతన సంవత్సరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ రాసిన అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన కవితతో ప్రారంభిద్దాం అంటూ ట్వీట్ చేసింది.

ఇప్పుడిప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు .. ఆశావహ దృక్పధంతో కూడిన కవిత
ప్రధాని మోడీ రాసిన కవిత సారాంశాన్ని చూస్తే
ఆకాశంలో తలెత్తి చూసినప్పుడు.. దట్టమైన మేఘాలు చీల్చుకుంటూ వెలుతురును ప్రకటించాలనే సంకల్పంతో సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడు.
ధృడ నిశ్చయంతో ముందుకు వెళుతూ, ప్రతి కష్టాన్ని అధిగమిస్తూ, గాఢ చీకట్లను తొలగించడానికి సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడు.
విశ్వాసం అనే చమురును జ్వలింపజేసి , వికాసం అనే దీపాన్ని తీసుకుని, కలలను నిజం చేసుకోవడానికి ఇప్పుడిప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు
Recommended Video

కరోనా కష్ట కాలంలో నైరాశ్యం నుండి వెలుగు వైపు సాగాలనే డిశా నిర్దేశం
తరతమ భేదం లేకుండా, నీది నాది అన్న తేడా లేకుండా, అందరి శక్తి తానే అయి ఇప్పుడిప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు.
అగ్నిని దాచుకుని, ప్రకాశాన్ని వెదజల్లుతూ , నడుస్తూ మరియు నడిపిస్తూ, ఇప్పుడిప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు ... ఇప్పుడిప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటూ ఆశావహ దృక్పథాన్ని తన కవిత్వం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల్లో నింపారు. చాలా అద్భుతమైన, గొప్ప స్ఫూర్తిదాయకమైన ఈ కవిత కరోనా కష్టకాలంలో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తుంది.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications