శ్రీమంతుల కొడుకుల టార్చర్ తట్టుకోలేక కాలేజ్ అమ్మాయి ఏం చేసిందంటే?, రెండు పేజీల్లో!
లక్నో/ఉత్తరప్రదేశ్: తనను అనేకసార్లు లైంగికంగా వేధించినా నిందితుల మీద స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విసిగిపోయిన కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుందని పోలీసు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని ఓ కాలేజ్ అమ్మాయి డెత్ నోట్ రాసిపెట్టి ఆత్మహత్యకు పాల్పడింది.
రెండు పేజీల సూసైడ్ నోట్ రాసింది. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్లోని స్థానిక పోలీసులు తన మీద లైంగిక దాడి చేసిన నిందితుల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తన ఇంటి సమీపంలో నివసించే కామాంధులు నిత్యం తనను వేధింపులకు గురి చేశారని, వారి చిత్రహింసలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని కాలేజ్ అమ్మాయి డెత్ నోట్ లో రాసిందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

నిందితులు ధనవంతులు కావడంతో తనతో పాటు తన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలేజ్ విద్యార్థిని డెత్ నోట్ లో ఆరోపించింది. సూసైడ్ నోట్లో తనను వేధింపులకు గురి చేసిన నలుగురు నిందితుల పేర్లు కూడా రాశానని, వారు తనను చంపడానికి ప్రయత్నించారని, వారి వేధింపులకు భయపడి తాను కాలేజ్ కు కూడా వెళ్లకుండా మానేశానని ఆమె డెత్ నోట్ లో వివరించింది.
కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ లో పిన్ టూ పిన్ రాసి ఆత్మహత్య చేసుకుంది. కాలేజ్ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న తరువాత మొరాదాబాద్ పోలీసులు వికేష్, అమృత్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారని, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని ఓ పోలీసు అధికారి స్థానిక మీడియాకు తెలిపారు. మొదటే నిందితుల మీద పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే మా అమ్మాయి బతికుండేదని కాలేజ్ అమ్మాయి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications