జార్ఖండ్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉందంటే..?
జార్ఖండ్ రాష్ట్రంలో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దృష్టి సారించింది. గత ఎన్నికల్లో తృటిలో చేజారిన విజయాన్ని ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేసింది. అట్టడుగు స్థాయిలో ఉన్న పార్టీ కార్యకర్తలతో సన్నిహిత బంధాన్ని ఏర్పరచుకోవడానికి బీజేపీ ఇప్పటికే తమ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఓటర్లతో ఉన్న సంబంధాలను మెరుగుపరుచుకుంటూనే ,జార్ఖండ్లో స్థానికంగా బలోపేతం కావడానికి ప్రాంతీయ పార్టీలతో పొత్తులను కూడా చురుకుగా కొనసాగిస్తోంది.
ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (AJSU) వంటి భాగస్వాములతో ఈ వ్యూహాత్మక సహకారం మరియు జనతాదళ్ యునైటెడ్ (JDU) పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ రెడీ అవుతోంది. ముఖ్యంగా ఏజేఎస్యూతో పొత్తు పెట్టుకోవడం ద్వారా గత ఎన్నికల్లో బీజేపీ కోల్పోయిన గిరిజన ఓట్లను తిరిగి చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాంతీయ పార్టీలతో పాలుపంచుకోవడం ద్వారా, బీజేపీ అధికారంలోకి రావాడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది.

అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) పార్టీ ఓటు బ్యాంకుపైనే బీజేపీ దృష్టి సారించింది. ఈక్రమంలోనే తమకు కలిసి వచ్చిన బీసీ మంత్రాన్ని జార్ఖండ్లో కూడా ప్రయోగిస్తోంది. జార్ఖండ్లో ఎన్నికల పోరు వేడెక్కుతున్న కొద్దీ, బీజేపీ తమ ప్రణాళికలకు పదును పెడుతోంది. గిరిజన సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మెజార్టీ ఓటర్లు తమవైపు తిప్పుకోవడంలో బీజేపీ విజయవంతం అయింది. ఓటర్లలో పెరుగుతున్న అధికార వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో బీజేపీ నేతలు నిమగ్నమయ్యారు. మరి జార్ఖండ్ ప్రజలు ఈసారి బీజేపీకి ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications