ఉప ఎన్నికల్లో సీఎం భార్య పోటీ, ఆస్తులు రూ. 100 కోట్లు: టీవీ చానల్, పరువు, ప్రతిష్ట!
బెంగళూరు: కర్ణాటకలోని రామనగర శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో జేడీఎస్ అభ్యర్థిగా అనితా కుమారస్వామి నామినేషన్ పత్రాలు సమర్పించారు. తన ఆస్తి విలువ సుమారు రూ. 100 కోట్లు ఉంటుందని, రూ. 8.14 కోట్లు రుణం ఉందని అనితా కుమారస్వామి తన అఫిడవిట్ లో దృవీకరించారు. అనితా కుమాస్వామి గెలుపును సంకీర్ణ ప్రభుత్వం పరువు ప్రతిష్టగా భావిస్తోంది.

సీఎం రాజీనామా
గత శాసన సభ ఎన్నికల్లో హెచ్.డి. కుమారస్వామి రామనగర, చెన్నపట్టణ శాసన సభ నియోజక వర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు. అనంతరం చెన్నపట్టణ నియోజక వర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతూ రామనగర నియోజక వర్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కుమారస్వామి రాజీనామాతో ఖాళీ అయిన రామనగర నియోజక వర్గం ఉప ఎన్నికల్లో జేడీఎస్ అభ్యర్థిగా అనితా కుమారస్వామి పోటీ చేస్తున్నారు.

రూ. 68.79 కోట్లు పెట్టుబడి
తాను బీఇ విద్యాభ్యాసం చేశానని సీఎం కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామి ఎన్నికల అఫిడవిట్ సమర్పించారు. కస్తూరి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ లో రూ. 68. 79 కోట్లు పెట్టుబడి పెట్టానని, దానితో పాటు రూ. 17. 6 కోట్లు రుణం ఇచ్చానని అనితా కుమారస్వామి అఫిడవిట్ సమర్పించారు. తన చరాస్తి విలువ రూ. 94 కోట్లు ఉంటుందని, జయనగర 4వ బ్లాక్ లోర రూ. 14 కోట్ల విలువైన భవనం, దోడ్డనకుంటె సమీపంలో రూ. 16 కోట్ల విలువైన భవనం ఉందని అనితా కుమారస్వామి ఎన్నికల కమీషన్ కు దృవీకరించారు.

రూ. 76 లక్షల ఆదాయం
2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ. 76. 35 లక్షల ఆదాయం వచ్చిందని అనితా కుమారస్వామి ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ సమర్పించారు. 2, 660 గ్రాముల బంగారం, 17 కేజీల వెండి, 40 క్యారెట్ల వజ్రాలతో సహ రూ.93. 33 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయని, రూ. 8. 29 లక్షల విలువైన ఖరీదైన బైక్, రూ. 20 లక్షల విలువైన కారు ఉందని అనితా కుమారస్వామి ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ సమర్పించారు.

రూ. 93 కోట్ల అప్పులు
వివిధ సంస్థలు, వ్యక్తుల దగ్గర రూ. 93. 39 కోట్లు రుణం తీసుకున్నానని, తన పేరుతో రూ. 42 లక్షల నగదు ఉందని, రూ.1. 90 కోట్లు డిపాజిట్లు ఉన్నాయని, వివిధ ఫైనాన్స్ సంస్థల నుంచి రూ. 8. 14 కోట్లు రుణం తీసుకున్నానని, ప్రస్తుతం తన చేతిలో రూ. 42 లక్షలు ఉందని అనితా కుమారస్వామి ఎన్నికల కమీషన్ కు అఫిడవిట్ సమర్పించారు.

పరువు ప్రతిష్ట
సీఎం స్థానంలో రామనగర శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే పదవికి హెచ్.డి. కుమారస్వామి రాజీనామా చేశారు. రామనగర ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన భార్యను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కుమారస్వామి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అభ్యర్థిగా (జేడీఎస్) బరిలో దిగిన అనితా కుమారస్వామి గెలుపు కోసం రెండు పార్టీల కార్యకర్తలు ప్రచారం ముమ్మరం చేశారు. అనితా కుమారస్వామి గెలుపు సంకీర్ణ ప్రభుత్వానికి పరువు ప్రతిష్టగా మారింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications